Godfather Chiranjeevi : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతకొద్ది రోజులుగా వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు అత్యంత భారీ బడ్జెత్తో తెరకెక్కించినవి అవడంతో సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తున్నాయి ఇక్కడి ప్రభుత్వాలు. దీంతో ప్రొడ్యూసర్స్ నష్టపోకుండా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ ఫలితం అందుకు భిన్నంగా ఉంది. కరోనా ప్రభావంతో సగటు మనిషి జీవితం తారుమారయ్యింది. ఇప్పుడిప్పుడే బతుకు బండి తిరిగి పట్టాలెక్కుతోంది.
ఇలాంటి సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో ఇప్పటికే సతమతమవుతున్న ఓ సామాన్య మనిషి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ ఖర్చు చేయలేక పోతున్నాడు. ఈ చిన్న లాజిక్ మిస్ చేసుకున్న సినీ పరిశ్రమ వరుసగా సినిమాలను భారీ టికెట్ రేట్లతో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రిలీజ్ రోజున టికెట్ దొరకడం గగనంగా మారేది. అప్పట్లో టికెట్ రేటు సాధారణంగా ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎంత పెద్ద స్టార్ అయినా పెరిగిన టికెట్ రేట్లతో థియేటర్లు వెలవెలబోతున్నాయి.
అందుకే ఇప్పుడు స్టార్స్ తమ ఆలోచనని మార్చుకున్నారు. టికెట్ రేట్లు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దసరాకి రిలీజ్ అవబోతున్న మెగా మూవీస్ గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు కూడా టికెట్ల రేట్లు తగ్గించుకున్నాయని తెలుస్తుంది. అక్టోబర్ 6 నుంచి గాడ్ ఫాదర్ మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 70 ఎంఎంలో టికెట్ రేటు 150 రూపాయలకే అందుబాటులో ఉంది. మొదటి రోజు కూడా దాదాపు అంతే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. మెగాస్టార్ మెగా ప్లాన్ నిజంగానే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. మరి తగ్గిన టికెట్ రేట్లతో అయినా చిరు సూపర్ హిట్ కొడతాడా.. కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా.. లేదా.. అన్నది చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…