Godfather Chiranjeevi : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతకొద్ది రోజులుగా వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు అత్యంత భారీ బడ్జెత్తో తెరకెక్కించినవి అవడంతో సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తున్నాయి ఇక్కడి ప్రభుత్వాలు. దీంతో ప్రొడ్యూసర్స్ నష్టపోకుండా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ ఫలితం అందుకు భిన్నంగా ఉంది. కరోనా ప్రభావంతో సగటు మనిషి జీవితం తారుమారయ్యింది. ఇప్పుడిప్పుడే బతుకు బండి తిరిగి పట్టాలెక్కుతోంది.
ఇలాంటి సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో ఇప్పటికే సతమతమవుతున్న ఓ సామాన్య మనిషి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ ఖర్చు చేయలేక పోతున్నాడు. ఈ చిన్న లాజిక్ మిస్ చేసుకున్న సినీ పరిశ్రమ వరుసగా సినిమాలను భారీ టికెట్ రేట్లతో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రిలీజ్ రోజున టికెట్ దొరకడం గగనంగా మారేది. అప్పట్లో టికెట్ రేటు సాధారణంగా ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎంత పెద్ద స్టార్ అయినా పెరిగిన టికెట్ రేట్లతో థియేటర్లు వెలవెలబోతున్నాయి.
అందుకే ఇప్పుడు స్టార్స్ తమ ఆలోచనని మార్చుకున్నారు. టికెట్ రేట్లు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దసరాకి రిలీజ్ అవబోతున్న మెగా మూవీస్ గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు కూడా టికెట్ల రేట్లు తగ్గించుకున్నాయని తెలుస్తుంది. అక్టోబర్ 6 నుంచి గాడ్ ఫాదర్ మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 70 ఎంఎంలో టికెట్ రేటు 150 రూపాయలకే అందుబాటులో ఉంది. మొదటి రోజు కూడా దాదాపు అంతే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. మెగాస్టార్ మెగా ప్లాన్ నిజంగానే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. మరి తగ్గిన టికెట్ రేట్లతో అయినా చిరు సూపర్ హిట్ కొడతాడా.. కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా.. లేదా.. అన్నది చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…