Garikapati : ప్రముఖ అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు గురించి అందరికీ తెలుసు. ఆయన అనేక అంశాలపై ఎంత సేపైనా మాట్లాడగలరు. పురాణాల్లోని అనేక విషయాల గురించి ఆయన అరటి పండు వొలిచి నోట్లో పెట్టినట్లు చాలా వివరంగా చెబుతుంటారు. అప్పటి శాస్త్రాలలోని అంశాలను నేటి తరానికి తగినట్లు.. ఇప్పటి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెబుతుంటారు. అలాగే మధ్య మధ్యలో జోకులు వేస్తూ నవ్విస్తుంటారు కూడా. ఇక ఈ మధ్య కాలంలో ఆయన పుష్ప సినిమాపై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా స్పందించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రకే అధిక ప్రాధాన్యతను కల్పించారని.. ఎన్టీఆర్ను అసలు ఎలివేట్ చేయలేదని.. ఫ్యాన్స్ గొడవ పడుతున్న విషయం విదితమే. అయితే ఇదే విషయంపై గరికపాటి కామెంట్స్ చేశారు. ఇంతకీ అసలు ఆయన ఏమన్నారంటే.. సినిమాల్లో హీరోలకే కాదు.. క్రికెట్ ప్లేయర్లకు కూడా భారీగా ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన నటుడు లేదా క్రికెటర్కు చిన్న గాయమైనా వారు తట్టుకోలేరు. అంతలా అభిమానులు ఉంటారు. అంత వరకు బాగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు వాళ్లకు అవమానాలు జరుగుతుంటాయి. దీంతో ఆ అవమానం ఏదో తమకే జరిగిందని ఫ్యాన్స్ భావిస్తారు. చేయరాని తప్పులు చేస్తారు. అది సరికాదు. అలా చేయడం వల్ల ఆ హీరో లేదా క్రికెటర్పై ఒత్తిడి పెరుగుతుంది.. అని గరికపాటి అన్నారు.
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్.. ఇలా అనేక మంది నటులు తమకు వచ్చిన పాత్రకు నో చెప్పకుండా చేశారు. అందుకనే వారు గొప్ప నటులు అయ్యారు. అంతేకానీ.. తమ హీరోకు చిన్న పాత్ర వచ్చిందని అభిమానులు ఫీల్ కాకూడదు. అది హీరోను ఎదగనివ్వదు. హీరో తరువాత సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. తక్కువ పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారేమోనని హీరో భావిస్తాడు. ఇది అతని ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. కనుక ఫ్యాన్స్ అంతలా శ్రుతి మించకూడదు.. పాత్ర చిన్నదే అయినా, హీరోకు అవమానం జరిగినా.. అది సినిమా.. దర్శకుడు చెప్పింది వినాలి.. హీరోకు స్వాతంత్య్రం ఇవ్వాలి. ఫ్యాన్స్ ఒత్తిడి తేకూడదు.. అని గరికపాటి చురకలంటించారు. మరి దీనిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ల ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…