Garikapati : ప్రముఖ అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు గురించి అందరికీ తెలుసు. ఆయన అనేక అంశాలపై ఎంత సేపైనా మాట్లాడగలరు. పురాణాల్లోని అనేక విషయాల గురించి ఆయన అరటి పండు వొలిచి నోట్లో పెట్టినట్లు చాలా వివరంగా చెబుతుంటారు. అప్పటి శాస్త్రాలలోని అంశాలను నేటి తరానికి తగినట్లు.. ఇప్పటి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెబుతుంటారు. అలాగే మధ్య మధ్యలో జోకులు వేస్తూ నవ్విస్తుంటారు కూడా. ఇక ఈ మధ్య కాలంలో ఆయన పుష్ప సినిమాపై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా స్పందించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రకే అధిక ప్రాధాన్యతను కల్పించారని.. ఎన్టీఆర్ను అసలు ఎలివేట్ చేయలేదని.. ఫ్యాన్స్ గొడవ పడుతున్న విషయం విదితమే. అయితే ఇదే విషయంపై గరికపాటి కామెంట్స్ చేశారు. ఇంతకీ అసలు ఆయన ఏమన్నారంటే.. సినిమాల్లో హీరోలకే కాదు.. క్రికెట్ ప్లేయర్లకు కూడా భారీగా ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన నటుడు లేదా క్రికెటర్కు చిన్న గాయమైనా వారు తట్టుకోలేరు. అంతలా అభిమానులు ఉంటారు. అంత వరకు బాగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు వాళ్లకు అవమానాలు జరుగుతుంటాయి. దీంతో ఆ అవమానం ఏదో తమకే జరిగిందని ఫ్యాన్స్ భావిస్తారు. చేయరాని తప్పులు చేస్తారు. అది సరికాదు. అలా చేయడం వల్ల ఆ హీరో లేదా క్రికెటర్పై ఒత్తిడి పెరుగుతుంది.. అని గరికపాటి అన్నారు.
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్.. ఇలా అనేక మంది నటులు తమకు వచ్చిన పాత్రకు నో చెప్పకుండా చేశారు. అందుకనే వారు గొప్ప నటులు అయ్యారు. అంతేకానీ.. తమ హీరోకు చిన్న పాత్ర వచ్చిందని అభిమానులు ఫీల్ కాకూడదు. అది హీరోను ఎదగనివ్వదు. హీరో తరువాత సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. తక్కువ పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారేమోనని హీరో భావిస్తాడు. ఇది అతని ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. కనుక ఫ్యాన్స్ అంతలా శ్రుతి మించకూడదు.. పాత్ర చిన్నదే అయినా, హీరోకు అవమానం జరిగినా.. అది సినిమా.. దర్శకుడు చెప్పింది వినాలి.. హీరోకు స్వాతంత్య్రం ఇవ్వాలి. ఫ్యాన్స్ ఒత్తిడి తేకూడదు.. అని గరికపాటి చురకలంటించారు. మరి దీనిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ల ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…