Garikapati : ఎంత పెద్ద పండితుడైన జీవితంలో ఒక్కొక్కసారి చిన్న విషయాలకు కూడా విమర్శలను ఎదుర్కొనవలసి ఉంటుంది. దీనికి ఎటువంటి వారైనా అతీతులు కారు. ప్రస్తుతం ఆ విధంగానే విమర్శలను ఎదుర్కొంటున్న పండితుడు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ప్రముఖ అవధానిగా పేరుగాంచిన ఈయన ఇటీవల బండారు దత్తాత్రేయ గారు నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలను చిరంజీవి అభిమానులే కాక సాధారణ వ్యక్తులు కూడా తీవ్రంగా ఖండించారు.
ఈ విషయం పట్ల మెగా అభిమానులు పెద్ద ఎత్తున గరికపాటి గారి మీద సోషల్ మీడియా వేదికగా యుద్ధం ప్రకటించారు. అయితే సద్దుమణిగింది అనుకున్న ఈ వ్యవహారంలో వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అవడంతో ఈ విషయం మళ్లీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రాంగోపాల్ వర్మ గరికపాటి గారిని ఉద్దేశిస్తూ గత 2 రోజులుగా తీవ్రమైన పదజాలంతో ట్వీట్లు పెడుతున్నాడు. గతంలో గరికపాటి మాట్లాడిన కొన్ని వీడియోలను జతచేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లు చేస్తున్నారు.
ఆ కోవలోనే ఆయన గరికపాటి గతంలో స్త్రీల పట్ల చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఆయన పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలని కోరడం జరిగింది. ఇంకా ప్రముఖ హీరోయిన్ అనుష్క అందచందాల గురించి గరికపాటి, గతంలో మాట్లాడిన మాటల వీడియోను జత చేస్తూ ఆహా అడ్డడ్డే.. అంటూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ల బాణాలను సంధిస్తున్నాడు. అయితే ఎప్పుడు ఎవరి వైపు ఉంటారో, ఆయనకే తెలియని వర్మ చిరంజీవి పక్షాన మాట్లాడుతూ గరికపాటిని ఇంకా ఎన్ని రోజులు తన ట్వీట్లతో వేధిస్తారు అనేది వేచి చూడవలసిందే..
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…