Samantha : అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత సినిమాలు, సిరీస్లలో బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఈమె చేసిన ఐటమ్ సాంగ్ ఈమెకు పాన్ ఇండియా లెవల్లో ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అయితే గతంలో అక్కినేని ఫ్యామిలీ పేరుతో సమంతకు అవకాశాలు బాగా వచ్చాయి. అలాగే ఆమె నటనలోనూ తనను తాను రుజువు చేసుకుంది. కనుక ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆమె లైఫ్ సాఫీగా సాగిపోయింది. కానీ ఇప్పుడు వేరు. అక్కినేని పేరును పూర్తిగా వదిలించుకుంది. తన సొంత కాళ్లపై తాను నిలబడుతోంది. అందువల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోవడం లేదు. అయితే ఆమె తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం ఫ్యాన్స్ను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం.. కాతు వాకుల రెండు కాదల్. ఈ మూవీ ఏప్రిల్ 28వ తేదీన తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. కణ్మణి రాంబో ఖతీజా పేరిట తెలుగులో దీన్ని విడుదల చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఈ మూవీలో సమంత పాత్రకు పెద్దగా అవకాశం లేదని.. ఆమె ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ సినిమాను తెరకెక్కించిన విగ్నేష్ శివన్.. నయనతార బాయ్ ఫ్రెండ్. ఆమె ఇందులో ఇంకో హీరోయిన్గా నటిస్తోంది. కనుక ఆమె పాత్రనే హైలైట్ చేశారని అంటున్నారు. అందువల్ల సమంతకు ఇందులో పెద్దగా ప్రాధాన్యతను కల్పించలేదని తెలుస్తోంది.
ఇక ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రస్తుతం చేపడుతున్నారు. కానీ సమంతను సైడ్ చేసి నయనతార హైలైట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. కనుక సమంత ఇందులో సెకండ్ హీరోయిన్ అనే విషయం స్పష్టమవుతోంది. అయితే సమంతకు హీరోయిన్ గా అంత మంచి పేరు ఉన్నప్పుడు ఆమె ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఎందుకు నటించిందని.. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని.. దీని వల్ల ఆమె ఇమేజ్ దెబ్బ తింటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే అక్కినేని పేరును వదిలించుకుని సొంతంగా ఇండస్ట్రీలో నిలబడాలని ట్రై చేస్తున్న సమంత ఇలా సెకండ్ హీరోయిన్గా చేయడం నచ్చడం లేదని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా స్టోరీ అయితే తెలియదు. అందువల్ల సినిమాలో సమంత ఇందులో నిజంగానే సెకండ్ హీరోయినా.. అన్న విషయంపై ఇప్పటికప్పుడు క్లారిటీ అయితే రాదు. సినిమా విడుదల అయితేనే దీనిపై స్పష్టత వస్తుంది. మరి ఫ్యాన్స్ అన్నట్లు ఈ మూవీలో సమంత నిజంగానే సెకండ్ హీరోయినా.. ఆమెకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదా.. అన్న విషయం నిజమవుతుందా.. లేదా.. అన్నది చూడాలి.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…