F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. ఎఫ్3. ఎఫ్2 తరువాత ఈ మూవీ రావడంతో దానికి సీక్వెల్ ఏమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ఎఫ్3లో కొత్త కథను చూపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్ల వసూలు దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రస్తుతం సక్సెస్ సంబరాలను నిర్వహిస్తోంది.
అయితే ఏ మూవీ విడుదల అయినా నెల రోజులు లేదా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. దీంతో ఎఫ్3 కూడా అలాగే వస్తుందని అనుకున్నారు. ఈ మేరకు ఓ వార్త కూడా బాగా ప్రచారం అయింది. అయితే దీనిపై వెంకటేష్ స్పందించారు. ఈ మూవీని 8 వారాల తరువాతనే ఓటీటీలోకి ఇస్తామని చెప్పారు. అప్పటి వరకు థియేటర్లకే వచ్చి నవ్వుకోవాలని అన్నారు. అంటే ఈ సినిమా మే27వ తేదీన రిలీజ్ అయింది కనుక జూలై చివర్లో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఇది కూడా కలెక్షన్లను బట్టే ఆధార పడి ఉంటుంది. మూవీకి ఇంకొన్ని రోజులు పోతే కలెక్షన్లు ఎలాగూ తగ్గుతాయి కనుక.. ఓటీటీకి ఇచ్చేస్తే కనీసం కాస్త ఎక్కువ మొత్తంలో అయిన ధర వస్తుంది. కనుక వారు 8 వారాలు అన్నారు కాబట్టి అప్పటి వరకు సినిమాను ఓటీటీలోకి రాకుండా ఆపుతారా.. అన్నది సందేహమే. అంతకన్నా ముందే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇక ఇందులో సోనాల్ చౌహన్, మురళీ శర్మ, అలీ, సునీల్, నటి ప్రగతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో నటి ప్రగతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన సినిమా కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్లలో నటించాను కానీ.. ఇలా ఎఫ్2, ఎఫ్3 మూవీలలో భిన్నమైన పాత్రల్లో నటించడం ఇదే మొదటిసారని.. ఇందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ తీసేందుకు ట్రై చేస్తానన్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…