TikTok : టిక్‌ టాక్‌ యూజర్లకు అదిరిపోయే న్యూస్‌.. భారత్‌లోకి మళ్లీ వస్తోంది..!

TikTok : మన దేశంలో ఒకప్పుడు టిక్‌టాక్‌ యాప్‌ సృష్టించిన హల్‌ చల్‌ అంతా ఇంతా కాదు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ అందులో వీడియోలు చూడడం లేదా వీడియోలు తీసి అప్ లోడ్‌ చేయడం పరిపాటిగా మారింది. దీంతో చాలా మంది ఈ ప్లాట్‌ఫామ్‌పై స్టార్లుగా మారారు. టిక్‌ టాక్‌ స్టార్‌ అనే బిరుదును తెచ్చుకున్నారు. అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. దేశభద్రతకు ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు తెలియజేసింది. వాటిల్లో టిక్‌టాక్‌ కూడా ఒకటి. అయితే ఈ యాప్‌ను నిషేధించాక చాలా మంది టిక్‌టాక్‌ యూజర్లు ఇతర యాప్‌లను వాడడం మొదలు పెట్టారు.

టిక్‌టాక్‌ నిషేధం అనంతరం ఎంఎక్స్‌ టకాటాక్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, చింగారి వంటి యాప్‌లు పాపులర్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ యాప్‌లలో యూజర్లు మళ్లీ వీడియోలను అప్ లోడ్‌ చేయడం మొదలు పెట్టారు. అయితే టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ తాజాగా భారతీయ యూజర్లకు అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. త్వరలోనే మళ్లీ ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ పత్రికలో వచ్చిన కథనం ద్వారా తెలుస్తోంది. దీంతో టిక్ టాక్‌ మళ్లీ భారత్‌లోకి వస్తుందన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటనను మాత్రం వెల్లడించలేదు.

TikTok

గతంలో భారత్‌ నిషేధించిన యాప్‌లలో ప్రముఖ యాప్‌ టిక్ టాక్‌ ఉంది. దీంతోపాటు పబ్‌జి గేమ్‌ను కూడా నిషేధించారు. అయితే ఆ గేమ్‌ డెవలపర్‌ అయిన క్రాఫ్టన్‌ సంస్థ చైనా సంస్థ అయిన టెన్సెంట్‌ గేమ్స్‌తో తెగదెంపులు చేసుకుంది. భారత్‌లో సొంతంగానే పబ్‌జి ని మళ్లీ రిలీజ్‌ చేసింది. దానికి బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియాగా పేరు మార్చి లాంచ్‌ చేసింది. దీంతో పబ్‌జి మళ్లీ భారత్‌లోకి వచ్చింది. కానీ టిక్ టాక్‌ మాత్రం ఇంకా ఆ ప్రయత్నం చేయలేదు. కారణం దాని మాతృసంస్థ బైట్‌ బ్యాన్స్‌ పూర్తిగా చైనా సంస్థనే. కనుక ఆ సంస్థ మన దేశంలో మనుగడ సాగించలేదు. కానీ ఇక్కడి సంస్థలతో భాగస్వామ్యం అయి డేటాను కూడా ఇక్కడే స్టోర్‌ చేస్తే మళ్లీ మన మార్కెట్‌లో ప్రవేశించవచ్చు. కనుక బైట్‌ డ్యాన్స్‌ సంస్థ భారత్‌కు చెందిన హిరనందని గ్రూప్‌తో భాగస్వామ్యం అయినట్లు తెలుస్తోంది. దీంతో టిక్‌టాక్‌ను త్వరలోనే భారత్‌లో మళ్లీ రిలీజ్‌ చేయనున్నారని సమాచారం.

ఇక అనుకున్న ప్రకారం జరిగితే మరో ఏడాదిలోగానే టిక్‌టాక్‌ భారత్‌లో మళ్లీ లాంచ్‌ అవుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. కాగా టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించి 2 ఏళ్లు అవుతోంది. ఈ యాప్‌ భారత్‌లో మళ్లీ వస్తే టిక్‌టాక్‌ మరింత పాపులర్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర యాప్స్‌ దెబ్బకు ఢమాల్‌ అనడం ఖాయం. మరి టిక్‌టాక్‌ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వివో నుంచి మరో పవర్ ఫుల్ ఫోన్.. భారత్‌లో Vivo X200T లాంచ్.. ఫీచర్లు, ధర చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…

Tuesday, 27 January 2026, 9:25 PM

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…

Tuesday, 27 January 2026, 7:39 PM

మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!

70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…

Tuesday, 27 January 2026, 5:49 PM

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM

అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…

Monday, 26 January 2026, 7:45 PM

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…

Monday, 26 January 2026, 5:34 PM