Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతోపాటు ఇటు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. బిగ్బాస్షోతో బుల్లితెరపై కూడా కింగ్ అనిపించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో రచ్చ చేస్తున్నాడు. టాప్ టీఆర్ఫీతో ఈ షో దూసుకుపోతోంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి షో ఆధారంగా వచ్చింది ఎవరు మీలో కోటీశ్వరులు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కింగ్ నాగార్జున బుల్లితెరపై సందడి చేయగా.. తాజాగా తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు.. అంటూ అలరిస్తున్నారు.
ఈ షోకి సామాన్యులతోపాటు సెలబ్స్ కూడా హాజరవుతున్నారు. మొదటి గెస్ట్గా తారక్ మిత్రుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంకు వచ్చి సందడి చేశారు. ఆ తర్వాత బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత, మ్యూజిక్ సెన్సేషన్స్ తమన్ – దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. ఇక మహేష్ కూడా హాజరు కాబోతున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం అవుతోంది.
డిసెంబర్ 4న రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు షో ప్రసారం కానుంది. గంటన్నర పాటు సాగనున్న ఎపిసోడ్ లో మహేష్ ఎన్టీఆర్ అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచనున్నారు. చివరిగా మహేష్, ఎన్టీఆర్ ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిశారు. ఈ వేడుకలో మహేష్-ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఎన్టీఆర్.. మహేష్ ని అన్న అని సంబోధిచడం, మహేష్.. ఎన్టీఆర్ ని తమ్ముడు అనడం.. ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పించింది. మరి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో, ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…