Evaru Meelo Koteeshwarulu : జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు (EMK) షోకు గాను ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను తీసుకువచ్చారు. దసరా సందర్భంగా సమంతకు చెందిన స్పెషల్ ఎపిసోడ్ను ప్రసారం చేశారు. అయినప్పటికీ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు రేటింగ్స్ రావడం కష్టంగా మారింది. అయితే ఈ షోకు గాను ఎన్టీఆర్ అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేశారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షో నవంబర్ మొదటి వారం వరకు ప్రసారం కానుంది. అయితే ఎన్టీఆర్ అన్ని ఎపిసోడ్స్కు చెందిన షూటింగ్ను పూర్తి చేశారు కనుక ఇకపై ఆ ఎపిసోడ్స్ ముగిసే వరకు ప్రసారం చేస్తారు. ఆ తరువాత సీజన్ను ఎప్పుడు ప్రారంభించేది, హోస్ట్గా ఎవరు వచ్చేది.. తరువాత వెల్లడిస్తారు. కానీ తరువాత సీజన్కు కూడా ఎన్టీఆర్నే హోస్ట్గా తీసుకుంటారా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ కూడా గతంలో గెస్ట్లుగా వచ్చారు. మోహన్ బాబు, తమన్, దేవిశ్రీప్రసాద్ వంటి వారితోనూ పలు ఎపిసోడ్స్ చేశారు. అయితే ఆ ఎపిసోడ్స్ ప్రసారం కావల్సి ఉంది. వాటిని దీపావళి రోజు ప్రసారం చేస్తారని తెలుస్తోంది.
ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఆరంభంలో అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. కానీ ఆ రేటింగ్స్ తరువాత వారాల్లో నిలబడలేదు. దీంతో పలువురు సెలబ్రిటీలతో ప్రయత్నం చేశారు. అవి కూడా విఫలం అయ్యాయి. ఇక ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…