Eesha Rebba : ప్రస్తుతం సినిమాలకే కాకుండా వెబ్ సిరీస్ కు కూడా బాగా క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లకు ఉన్న పాపులారిటీని గమనించి చాలా మంది దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించి సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లో సందడి చేయగా త్వరలోనే రకుల్, చైతన్య వంటి సెలబ్రిటీలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా రవి నంబూరి కథతో మ్యాగీ దర్శకత్వంలో తెలుగు ఓటీటీ ఆహా కోసం ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. ఇందులో నటించడం కోసం ముగ్గురు హీరోయిన్లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరిగా ఈశా రెబ్బ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలోనే మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ విషయానికి వస్తే ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్, ఆదాశర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు ఈ చిత్రంలో నటిస్తున్నారా లేదా అనే విషయం గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే ఈమె ఇందులో రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…