Turmeric Milk : పసుపును భారతీయలు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. పసుపును నిత్యం అనేక వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వంటి వైరస్లతోపాటు బాక్టీరియాలను ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. ఈ సీజన్లో సహజంగానే దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాంటి వారు రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
3. పసుపు మన చర్మాన్ని ఎంతగానో రక్షిస్తుంది. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.
4. నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గిపోయి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
5. కీళ్ల నొప్పులు ఉన్నవారు, గాయాలు, దెబ్బలు, పుండ్లు అయిన వారు పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.
6. సైనస్ సమస్య ఉన్నవారు రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఛాతి పట్టేయడం, కఫం తగ్గుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…