Donkey Milk : హైదరాబాద్కు సమీప ప్రాంతాల నుంచి అనేక మంది నగరానికి వచ్చి అనేక వ్యాపారాలు చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో గాడిద పాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. నగరానికి సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న రైతులు కొందరు గాడిదల్ని పెంచుతూ చక్కని ఆదాయం సంపాదిస్తున్నారు. వారు వారం లేదా 15 రోజులకు ఒకసారి గాడిదలను తెచ్చి నగరంలో వాటి పాలను అమ్ముతూ లాభాలను గడిస్తున్నారు. ఈ క్రమంలోనే లీటర్ గాడిద పాల ధర రూ.7వేల వరకు పలుకుతోంది.
గాడిద పాలను సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అంతేకాకుండా ఈ పాలలో ఆవు, గేదె, మేక పాల కన్నా విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయట. ఇవి అనేక రోగాల నుంచి రక్షిస్తాయట. అలాగే టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే ఔషధ గుణాలు కూడా గాడిద పాలలో ఉంటాయట. కనుకనే ఈ పాలను తాగేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక తక్కువ మొత్తంలో కావాలంటే 10 ఎంఎల్ సీసాలను కూడా విక్రయిస్తున్నారు. వీటి ధర సీసాకు రూ.100 వరకు పలుకుతుండడం విశేషం. సాధారణ పాలు అయితే మనకు రూ.100 పెడితేనే లీటర్కు పైగానే వస్తాయి. కానీ గాడిద పాలు మాత్రం 10 ఎంఎల్ వరకు మాత్రమే వస్తాయి. దీంతో ఈ వ్యాపారం మంచి లాభసాటిగా ఉందని రైతులు చెబుతున్నారు.
హైదరాబాద్కు సమీపంలో ఉన్న మహబూబ్నగర్ జిల్లా నుంచి చాలా మంది రైతులు గాడిద పాలను తెచ్చి విక్రయిస్తున్నారు. అయితే కొందరు ఐటీ ఉద్యోగులు కూడా చేస్తున్న ఉద్యోగాలను మానేసి గాడిదల ఫామ్లను పెట్టి పాలను అమ్ముతూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నారట. దీంతో ఇదో కొత్త ఉపాధి మార్గం అయిందని అంటున్నారు. ఇక గాడిద పాలలో మన శరీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా కూడా అధికంగా ఉంటుందట. అందువల్లే ఈ పాలకు అంతటి డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. ఇక ఇదంతా చూసి నాలుగు గాడిదల్ని పెట్టుకున్నా దర్జాగా డబ్బులు సంపాదించవచ్చు కదా.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…