Chiranjeevi : ఒకప్పుడు యాడ్స్ అంటే కేవలం మోడల్స్ మాత్రమే ఎక్కువ చేసేవారు. కానీ ఈ తర్వాత కాలంలో జనాలలో సినిమా నటులకు కూడా మంచి గుర్తింపు రావడం మొదలయింది. ఏ స్టార్స్ అయితే ప్రజలలో ఎక్కువగా ఆదరణ ఉంటుందో ఆ స్టార్స్ తో యాడ్స్ తీయడం మొదలయ్యింది. ఇప్పుడు ఏకంగా కోట్లు ఇచ్చి వాల బ్రాండ్లు ప్రోమోట్ చేస్కోడంకి.. స్టార్స్ ని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకుంటున్నారు. స్టార్స్ సైతం సినిమాల్లో కన్నా కూడా యాడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం రావడంతో ప్రకటనలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అయితే గతంలో థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సికి బ్రాండ్ అంబాసిడర్ ఉండేవారు. అంతేకాదు నవరత్న ఆయిల్ కి కూడా చిరంజీవి అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత కాలంలో థమ్స్ అప్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అయితే చిరు థమ్స్ అప్ యాడ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసినపుడు ఒక వివాదం తలెత్తింది. కానీ మహేష్ ఈ యాడ్ చేసే టైంలో ఎలాంటి వివాదం రాలేదు.
ఓ బాధ్యతాయుతమైనా స్థానంలో ఉంటూ, చిన్నపిల్లలకు ,పెద్దలకు చెడు చేసే ఇలాంటి హానికరమైన శీతల పానీయాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ఏమిటని చాలామంది చిరంజీవిని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ విమర్శలకు ఫలితంగా చిరంజీవి,పవన్ కళ్యాణ్ లు నాటినుంచి నేటివరకూ కూడా ఎలాంటి వాణిజ్య ప్రకటనలలో పాలుపంచుకోవడం లేదు. కేవలం ఈ ఒక్క కారణం వల్లే పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్, హీరోయిన్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, సమంత వంటి వారు సినిమాలతో పాటు అనేక వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…