Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ల ప్రేమకు గుర్తుగా జన్మించిన అకీరా నిత్యం ఏదో ఒక వార్తలో ఉంటున్నాడు. అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇందుకు గల కారణం అకీరా తరచూ ఇప్పుడు పవన్ వెంట దర్శనం ఇవ్వడమే. పైగా తండ్రి పవన్ ని మించి పోయి 6ప్లస్ హైట్ తో సినీ హీరోని తలపిస్తున్నాడు. పబ్లిక్ లో కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. అందుకే ఈ మెగా వారసుణ్ణి చూసి పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
2004 ఏప్రిల్ 8నా అకీరా పుడితే 2009లో పవన్ కళ్యాణ్ రేణు దేశాల వివాహం జరిగింది. 2010 మార్చి 23 ఈ జంటకు ఆధ్య జన్మించింది. ఆ తరువాత 2012లో పవన్, రేణు విడిపోవడం ఇలా అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. పవన్ నుంచి వేరుపడిన వెంటనే అకీరా, ఆధ్యలను తీసుకుని పూణే వెళ్లి , మరాఠీ సినీ ఇండస్ట్రీలో దర్శకురాలిగా స్థిరపడింది రేణు దేశాయ్.
పవన్ కళ్యాణ్ తో విడాకులు తర్వాత తన కొడుకు, కూతురు ప్రాణంగా బతుకుతోంది రేణు దేశాయ్. ఆ ఇద్దరికీ సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ వారి కెరీర్ కి మంచి బాటలు వేస్తోంది. అకీరా ప్రస్తుతం తను ఉన్నత చదవటం చదువు కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాడు. ఇక అసలు విషయానికొస్తే రేణు అకిరా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
పూణేలో అకీరాకు ఫ్రెండ్స్ తక్కువే. రేణు మేనల్లుడు తో అకీరా ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. ఓరోజు అతడి స్కూల్ పుస్తకంపై హీరోయిన్ శిల్ప శెట్టి ఫోటో ఉండడంతో తట్టుకోలేకపోయిన అకీరా వెంటనే తల్లికి కంప్లైంట్ చేసాడు. రేణు తన మేనల్లునితో కలిసి స్కూల్ కి వెళ్లి, ప్రిన్సిపాల్ తో చెప్పి పెద్ద క్లాస్ పీకిందట. నైతిక విలువల పట్ల నిబద్దత గల అకీరా చదువుకునే పుస్తకాలపై ఇలా హీరోయిన్స్ బొమ్మలు ఉండడం భరించలేకపోయాడు. ఇప్పటినుంచే సమాజం, విలువలు అంటూ తండ్రి పవన్ బాటలో పయనిస్తున్న అకీరా భవిష్యత్ లో సామాజిక ఉద్యమకారుడు అవుతాడని ఇంటర్వ్యూ ద్వారా రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…