Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ల ప్రేమకు గుర్తుగా జన్మించిన అకీరా నిత్యం ఏదో ఒక వార్తలో ఉంటున్నాడు. అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇందుకు గల కారణం అకీరా తరచూ ఇప్పుడు పవన్ వెంట దర్శనం ఇవ్వడమే. పైగా తండ్రి పవన్ ని మించి పోయి 6ప్లస్ హైట్ తో సినీ హీరోని తలపిస్తున్నాడు. పబ్లిక్ లో కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. అందుకే ఈ మెగా వారసుణ్ణి చూసి పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
2004 ఏప్రిల్ 8నా అకీరా పుడితే 2009లో పవన్ కళ్యాణ్ రేణు దేశాల వివాహం జరిగింది. 2010 మార్చి 23 ఈ జంటకు ఆధ్య జన్మించింది. ఆ తరువాత 2012లో పవన్, రేణు విడిపోవడం ఇలా అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. పవన్ నుంచి వేరుపడిన వెంటనే అకీరా, ఆధ్యలను తీసుకుని పూణే వెళ్లి , మరాఠీ సినీ ఇండస్ట్రీలో దర్శకురాలిగా స్థిరపడింది రేణు దేశాయ్.
పవన్ కళ్యాణ్ తో విడాకులు తర్వాత తన కొడుకు, కూతురు ప్రాణంగా బతుకుతోంది రేణు దేశాయ్. ఆ ఇద్దరికీ సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ వారి కెరీర్ కి మంచి బాటలు వేస్తోంది. అకీరా ప్రస్తుతం తను ఉన్నత చదవటం చదువు కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాడు. ఇక అసలు విషయానికొస్తే రేణు అకిరా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
పూణేలో అకీరాకు ఫ్రెండ్స్ తక్కువే. రేణు మేనల్లుడు తో అకీరా ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. ఓరోజు అతడి స్కూల్ పుస్తకంపై హీరోయిన్ శిల్ప శెట్టి ఫోటో ఉండడంతో తట్టుకోలేకపోయిన అకీరా వెంటనే తల్లికి కంప్లైంట్ చేసాడు. రేణు తన మేనల్లునితో కలిసి స్కూల్ కి వెళ్లి, ప్రిన్సిపాల్ తో చెప్పి పెద్ద క్లాస్ పీకిందట. నైతిక విలువల పట్ల నిబద్దత గల అకీరా చదువుకునే పుస్తకాలపై ఇలా హీరోయిన్స్ బొమ్మలు ఉండడం భరించలేకపోయాడు. ఇప్పటినుంచే సమాజం, విలువలు అంటూ తండ్రి పవన్ బాటలో పయనిస్తున్న అకీరా భవిష్యత్ లో సామాజిక ఉద్యమకారుడు అవుతాడని ఇంటర్వ్యూ ద్వారా రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…