ఢిల్లీలో శ్రద్ధ అనే యువతి హత్య సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఆఫ్తాబ్ అనే యువకుడు ఆమెను ముక్కలుగా నరికి ఢిల్లీ అంతటా పడేశాడు. తరువాత ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితున్ని పోలీసులు పట్టుకుని విచారించగా.. అతను అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. అయితే పోలీసుల విచారణలో అనేక విషయాలు తెలిశాయి. ఆఫ్తాబ్ అంతా పకడ్బందీగా చేశాడు. కానీ ఒక చిన్న తప్పు వల్లనే అతను దొరికిపోయాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రద్ధ అనే యువతి కనిపించడం లేదని ఆమె తండ్రి ముంబైలోని వాసాయ్ పోలీస్ స్టేషన్ లో గత నెలలో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 26న పోలీసులు విచారణకు ఆప్తాబ్ ను పిలిచారు. అయితే శ్రద్ధ మే 22 నే ఢిల్లీ మెహ్రలిలో తాము నివసించే ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయిందని అప్తాబ్ చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగాక తనను వదిలేసిందని పేర్కొన్నాడు. దుస్తులు, ఇతర వస్తువులను ఫ్లాట్ లోనే ఉంచి మొబైల్ మాత్రమే తనతోపాటు తీసుకెళ్లిందని నమ్మబలికాడు. ఆ తర్వాత మళ్లీ తనను ఆమె కలవలేదు అన్నాడు. కానీ వాస్తవానికి నాలుగు రోజుల ముందే అంటే మే 18న ఆమెను అతను హత్య చేశాడు. అప్పటికి ఇద్దరు ఢిల్లీ ఫ్లాట్ కు మారి 2 వారాలే అయింది.
కాగా ఆప్తాబ్ ను విచారించిన అనంతరం పోలీసులు శ్రద్ధ మొబైల్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. మే 22-26 మధ్య ఆమె ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రలి లోనే ఉన్నట్లు తేలింది. అలాగే శ్రద్ధ బ్యాంకు ఖాతా నుంచి ఆప్తాబ్ కు రూ.54వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. దీంతో పోలీసులకు అప్తాబ్ పై మరోసారి అనుమానం వచ్చింది. అనంతరం పోలీసులు శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ చాట్ ను పరిశీలించారు. అందులో మే 31 ఆమె ఓ ఫ్రెండ్ తో చాట్ చేసింది. అప్పుడు కూడా ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రలి లోనే ఉన్నట్లు చూపించింది. దీంతో వాసాయ్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. మే 22న వెళ్లిపోయిన ఆమె ఫోన్ లొకేషన్ మే 31న కూడా ఢిల్లీ మెహ్రలి లోనే ఎలా ఉందని ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు అప్తాబ్. తానే శ్రద్ధను హతమార్చి 35 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు చెప్పాడు. ఒక్కో పార్ట్ ను ఒక్కో రోజు తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసినట్లు వివరించాడు. కాగా ఆఫ్తాబ్ తాను ఓ ఇంగ్లిష్ సిరీస్ ఆధారంగా శ్రద్ధాను హత్య చేసినట్లు చెప్పాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…