ఢిల్లీలో శ్రద్ధ అనే యువతి హత్య సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఆఫ్తాబ్ అనే యువకుడు ఆమెను ముక్కలుగా నరికి ఢిల్లీ అంతటా పడేశాడు. తరువాత ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితున్ని పోలీసులు పట్టుకుని విచారించగా.. అతను అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. అయితే పోలీసుల విచారణలో అనేక విషయాలు తెలిశాయి. ఆఫ్తాబ్ అంతా పకడ్బందీగా చేశాడు. కానీ ఒక చిన్న తప్పు వల్లనే అతను దొరికిపోయాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రద్ధ అనే యువతి కనిపించడం లేదని ఆమె తండ్రి ముంబైలోని వాసాయ్ పోలీస్ స్టేషన్ లో గత నెలలో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 26న పోలీసులు విచారణకు ఆప్తాబ్ ను పిలిచారు. అయితే శ్రద్ధ మే 22 నే ఢిల్లీ మెహ్రలిలో తాము నివసించే ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయిందని అప్తాబ్ చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగాక తనను వదిలేసిందని పేర్కొన్నాడు. దుస్తులు, ఇతర వస్తువులను ఫ్లాట్ లోనే ఉంచి మొబైల్ మాత్రమే తనతోపాటు తీసుకెళ్లిందని నమ్మబలికాడు. ఆ తర్వాత మళ్లీ తనను ఆమె కలవలేదు అన్నాడు. కానీ వాస్తవానికి నాలుగు రోజుల ముందే అంటే మే 18న ఆమెను అతను హత్య చేశాడు. అప్పటికి ఇద్దరు ఢిల్లీ ఫ్లాట్ కు మారి 2 వారాలే అయింది.
కాగా ఆప్తాబ్ ను విచారించిన అనంతరం పోలీసులు శ్రద్ధ మొబైల్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. మే 22-26 మధ్య ఆమె ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రలి లోనే ఉన్నట్లు తేలింది. అలాగే శ్రద్ధ బ్యాంకు ఖాతా నుంచి ఆప్తాబ్ కు రూ.54వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. దీంతో పోలీసులకు అప్తాబ్ పై మరోసారి అనుమానం వచ్చింది. అనంతరం పోలీసులు శ్రద్ధ ఇన్స్టాగ్రామ్ చాట్ ను పరిశీలించారు. అందులో మే 31 ఆమె ఓ ఫ్రెండ్ తో చాట్ చేసింది. అప్పుడు కూడా ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రలి లోనే ఉన్నట్లు చూపించింది. దీంతో వాసాయ్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. మే 22న వెళ్లిపోయిన ఆమె ఫోన్ లొకేషన్ మే 31న కూడా ఢిల్లీ మెహ్రలి లోనే ఎలా ఉందని ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు అప్తాబ్. తానే శ్రద్ధను హతమార్చి 35 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు చెప్పాడు. ఒక్కో పార్ట్ ను ఒక్కో రోజు తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసినట్లు వివరించాడు. కాగా ఆఫ్తాబ్ తాను ఓ ఇంగ్లిష్ సిరీస్ ఆధారంగా శ్రద్ధాను హత్య చేసినట్లు చెప్పాడు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…