Liger : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం.. లైగర్. ఈ మూవీ గురించి చిత్ర బృందం ఎప్పటికప్పుడు అప్డేట్స్ను విడుదల చేస్తూ ఉంది. అయితే ఇందులో అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్న విషయం విదితమే. ఆయనను అసలు ఎలా కలిశారు, ఎలా ఒప్పించారు ? అన్న చర్చే ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. ఇక ఇప్పుడు తాజాగా ఆయనకు ఇస్తున్న పారితోషికం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీకి గాను విజయ్ దేవరకొండ పూర్తిగా అంకితం అయ్యాడు. ఈ మూవీ విడుదల అయ్యే వరకు మరో మూవీని అతను చేయబోవడం లేదని తెలుస్తోంది. దీంతో అతను రెండేళ్ల కాలానికి ఏకంగా రూ.20 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మైక్ టైసన్కు విజయ్ కన్నా ఎక్కువగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంటే.. ఆయనకు విజయ్ కన్నా రెండింతల ఎక్కువ మొత్తం అనుకున్నా.. రూ.40 కోట్లు అవుతాయి.
అయితే మైక్ టైసన్కు రూ.40 కోట్ల మేర పారితోషికం ఇస్తున్నారా, లేదా.. అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆయనకు ఒక వేళ అంత మొత్తం ఇచ్చినా.. పోస్టర్లలో టైసన్ బొమ్మ ఉంటే బిజినెస్ బాగా జరుగుతుందని నిర్మాతలు విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు ఇచ్చే దానికన్నా రెండు మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆయనకు భారీ మొత్తం ముట్టజెప్పి మరీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే లైగర్ మూవీ ఏ మేర ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది ? అన్నది తెలియాలంటే.. చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…