NTR : తెలుగు సినీ చరిత్రకే ఆయనొక నట సార్వభౌముడు. నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతగా మూడు వందలకు పైగా సినిమాలు తెరకెక్కించి తెలుగునాట ప్రేక్షకులను మెప్పించి అలరించారు. రాముడు.. కృష్ణుడు.. అంటే ఇలాగే ఉంటారేమో అనే భావం ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. అంతటి ఘనతను సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అందుకు పెద్దల ఆశీర్వచనాలే కారణం.
నటనలో.. భావ వ్యక్తీకరణలో తీర్చిదిద్దిన గురువులకు ఎంత చేసినా తక్కువే. ఎన్టీఆర్ కు తెలుగు భాష మీద పట్టు ఉండేది. తెలుగును ఆయన ఎంతగానో ప్రేమించేవారు. కాలేజీ రోజులలో తెలుగు పాఠాలు నేర్పిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.
ఆయన జ్ఞానపీఠ అవార్డు విజేత. సాహితీ మూర్తి, ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆయన నిలువెత్తు రూపంగా నిలిచారు. అలాంటి గురువు ప్రోత్సాహంతో ఎన్టీఆర్ నాయకురాలు నాగమ్మ నాటకంలో నాగమ్మగా పాత్రను పోషించారు. అలా ఎన్నో మెళకువలను ఎన్టీఆర్ గురువు నుండి నేర్చుకున్నవే. అందుకే ఆయనంటే ఎన్టీఆర్ కు ఎంతో మక్కువ. విశ్వనాథ రచించిన నవల ఏకవీర సినిమాలో ఎన్టీఆర్ కథనాయకుడు. సినిమా ఫంక్షన్లు అయినా సరే విశ్వనాథ సత్యనారాయణ నిలయం ఉన్న విజయవాడలోనే పెట్టేవారు.
ఆయనను ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పిలిచి సత్కరించేవారు. ఘంటసాల చివరి రోజుల్లో గానం చేసిన భగవద్గీత గ్రామ ఫోన్ రికార్డ్స్ ని ఆవిష్కరించడానికి ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తే.. విజయవాడలో ఆ కార్యక్రమం నిర్వహించాలని అడిగారు. అలా భగవద్గీత మొదటి రికార్డ్ ని ఆయన గురువు విశ్వనాథకి ఇవ్వాలనేది ఎన్టీఆర్ ఆశ. అలా ప్రతి విషయంలోనూ విశ్వనాథపై శిష్య వాత్సల్యం చూపిస్తూ.. ఎన్టీఆర్ గురుభక్తిని నిరూపించుకున్నారు. ఆయన దివంగతులు అయ్యేవరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అందుకే తెలుగు వారి గుండెల్లో నందమూరి తారక రామారావు అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…