NTR : తెలుగు సినీ చరిత్రకే ఆయనొక నట సార్వభౌముడు. నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతగా మూడు వందలకు పైగా సినిమాలు తెరకెక్కించి తెలుగునాట ప్రేక్షకులను మెప్పించి అలరించారు. రాముడు.. కృష్ణుడు.. అంటే ఇలాగే ఉంటారేమో అనే భావం ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. అంతటి ఘనతను సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అందుకు పెద్దల ఆశీర్వచనాలే కారణం.
నటనలో.. భావ వ్యక్తీకరణలో తీర్చిదిద్దిన గురువులకు ఎంత చేసినా తక్కువే. ఎన్టీఆర్ కు తెలుగు భాష మీద పట్టు ఉండేది. తెలుగును ఆయన ఎంతగానో ప్రేమించేవారు. కాలేజీ రోజులలో తెలుగు పాఠాలు నేర్పిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.
ఆయన జ్ఞానపీఠ అవార్డు విజేత. సాహితీ మూర్తి, ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆయన నిలువెత్తు రూపంగా నిలిచారు. అలాంటి గురువు ప్రోత్సాహంతో ఎన్టీఆర్ నాయకురాలు నాగమ్మ నాటకంలో నాగమ్మగా పాత్రను పోషించారు. అలా ఎన్నో మెళకువలను ఎన్టీఆర్ గురువు నుండి నేర్చుకున్నవే. అందుకే ఆయనంటే ఎన్టీఆర్ కు ఎంతో మక్కువ. విశ్వనాథ రచించిన నవల ఏకవీర సినిమాలో ఎన్టీఆర్ కథనాయకుడు. సినిమా ఫంక్షన్లు అయినా సరే విశ్వనాథ సత్యనారాయణ నిలయం ఉన్న విజయవాడలోనే పెట్టేవారు.
ఆయనను ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పిలిచి సత్కరించేవారు. ఘంటసాల చివరి రోజుల్లో గానం చేసిన భగవద్గీత గ్రామ ఫోన్ రికార్డ్స్ ని ఆవిష్కరించడానికి ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తే.. విజయవాడలో ఆ కార్యక్రమం నిర్వహించాలని అడిగారు. అలా భగవద్గీత మొదటి రికార్డ్ ని ఆయన గురువు విశ్వనాథకి ఇవ్వాలనేది ఎన్టీఆర్ ఆశ. అలా ప్రతి విషయంలోనూ విశ్వనాథపై శిష్య వాత్సల్యం చూపిస్తూ.. ఎన్టీఆర్ గురుభక్తిని నిరూపించుకున్నారు. ఆయన దివంగతులు అయ్యేవరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అందుకే తెలుగు వారి గుండెల్లో నందమూరి తారక రామారావు అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…