IPL 2022 : దాదాపుగా రెండు నెలల నుంచి జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ ముగింపునకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నో మ్యాచ్లు ఆడిన టీమ్లు అలసిపోయాయి. ఈ క్రమంలోనే తుది పోరు కోసం కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనున్నాయి. ఈ రెండు జట్లలో విన్నర్ ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఈసారి ఐపీఎల్ లో 10 జట్లు పాల్గొనగా.. ఆరంభ టోర్నీలోనే గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. కొన్ని మ్యాచ్లు మినహా దాదాపుగా ఏకపక్షంగానే మ్యాచ్లలో విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. కానీ ఆ తరువాత ఈ జట్టు మళ్లీ నెగ్గలేదు. దీంతో మరోమారు ట్రోఫీ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇక గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ క్రమంలోనే ఈ ఫైనల్లో గెలుపొందిన విజేతలకు ఈసారి రూ.20 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇక రన్నరప్ జట్టుకు రూ.13 కోట్లు వస్తాయి.
ఇక ఈసారి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్కు ఆరెంజ్ క్యాప్తోపాటు రూ.15 లక్షలు ప్రైజ్ మనీగా లభిస్తుంది. ఈ లిస్ట్లో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్మన్ జాస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు 16 మ్యాచ్ లు ఆడి 824 పరుగులు సాధించాడు. అలాగే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కు పర్పుల్ క్యాప్తోపాటు రూ.15 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. ఈ లిస్ట్లో బెంగళూరు బౌలర్ హసరంగ, రాజస్థాన్ బౌలర్ చాహల్ ఉన్నారు. వీరు చెరో 26 వికెట్లు తీశారు. అయితే ఫైనల్ లో కనీసం ఒక వికెట్ తీసినా చాలు.. చాహల్కే పర్పుల్ క్యాప్ లభిస్తుంది. దీంతోపాటు ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…