సూర్య భ‌గ‌వానుడి అనుగ్ర‌హం ఇలా పొందితే.. స‌క‌ల రోగాలు పోతాయి..

సూర్యుడు స‌మ‌స్త జీవ‌కోటికి కాంతిని, శ‌క్తిని అందించే ప్ర‌దాత‌. సూర్యుని కిర‌ణాలు భూమిపై ప‌డి ఎన్నో కోట్ల జీవ‌రాశుల‌కు మ‌నుగ‌డ‌నిస్తున్నాయి. అలాంటి సూర్యుడు లేక‌పోతే మ‌న‌కు ఆహారం ఉండ‌దు. భూమిపై మ‌నిషి స‌హా ఏ జీవి కూడా బ‌త‌క‌లేదు. ఇక జ్యోతిష్య‌శాస్త్రం ప‌రంగా కూడా సూర్యుడికి ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. 9 గ్ర‌హాల్లో సూర్య గ్ర‌హం కూడా ఒక‌టి. ఇత‌ర గ్ర‌హాల మాదిరిగానే సూర్య భ‌గ‌వానున్ని కూడా పూజించాలి. దీంతో సూర్యుడి అనుగ్ర‌హం ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో అనేక ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే కొంద‌రికి ర‌వి దోషం ఉంటుంది. దీన్నే సూర్య దోషం అంటారు. అలాంటి వారు కూడా కింద చెప్పిన విధంగా చేస్తే స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దోషం పోతుంది. అందుకు ఏం చేయాలంటే..

సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం క‌చ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే శాకాహారం మాత్ర‌మే తినాలి. మాంసాహారం ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌రాదు. ఇక కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుడిని ఆరాధిస్తే ఎంతో మేలు జ‌రుగుతుంది. సూర్యగ్రహ ఆరాధన వల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతోపాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. ఉపవాసం ఉన్న రోజు తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి. గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి దానమివ్వాలి. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసంతో దానమిస్తే ఇంకా ఎక్కువ ఫ‌లితం వ‌స్తుంది.

ఇక పైవాటిని ఆచరించడానికి ఇబ్బందులు ఉంటే మొదట భక్తి ,శ్రద్ధతో నవగ్రహాలలో సూర్యుని ముందు నిలబడి.. స్వామి, నా సమస్యలు పరిష్కారం అయితే నేను విధివిధానం ప్రకారం పూజ చేసుకుంటాను అని మొక్కుకోవాలి. సూర్యునికి సంబంధించి జపాకుసుమ సంకాశం.. అనే శ్లోకాన్ని లేదా ఓం నమో భాస్కరాయనమః లేదా ఓం నమో సూర్యనారాయణాయనమః అనే నామాన్ని భక్తి శ్రద్దల‌తో కనీసం 108కి తగ్గకుండా పారాయణం చేయాలి. ఎర్రనిపూలు, గోధుమలను సూర్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కనీసం 7 వారాల పాటు చేస్తే తప్పక మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉండాలనుకువారు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే తెల్ల‌వారు జామునే స్నానం పూర్తి చేసుకుని సూర్యనమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా పారిపోతాయి. అంతేకాదు.. పిల్లలకు అయితే జ్ఞాపకశక్తి చాలా వేగంగా పెరుగుతుంది. క‌నుక సూర్య భ‌గ‌వానున్ని ఆరాధించాలి. దీంతో స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌డంతోపాటు ఆరోగ్యం కూడా ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వివో నుంచి మరో పవర్ ఫుల్ ఫోన్.. భారత్‌లో Vivo X200T లాంచ్.. ఫీచర్లు, ధర చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…

Tuesday, 27 January 2026, 9:25 PM

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…

Tuesday, 27 January 2026, 7:39 PM

మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!

70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…

Tuesday, 27 January 2026, 5:49 PM

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM

అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…

Monday, 26 January 2026, 7:45 PM

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…

Monday, 26 January 2026, 5:34 PM