సూర్యుడు సమస్త జీవకోటికి కాంతిని, శక్తిని అందించే ప్రదాత. సూర్యుని కిరణాలు భూమిపై పడి ఎన్నో కోట్ల జీవరాశులకు మనుగడనిస్తున్నాయి. అలాంటి సూర్యుడు లేకపోతే మనకు ఆహారం ఉండదు. భూమిపై మనిషి సహా ఏ జీవి కూడా బతకలేదు. ఇక జ్యోతిష్యశాస్త్రం పరంగా కూడా సూర్యుడికి ప్రాధాన్యతను ఇచ్చారు. 9 గ్రహాల్లో సూర్య గ్రహం కూడా ఒకటి. ఇతర గ్రహాల మాదిరిగానే సూర్య భగవానున్ని కూడా పూజించాలి. దీంతో సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో అనేక ఫలితాలను పొందవచ్చు. అయితే కొందరికి రవి దోషం ఉంటుంది. దీన్నే సూర్య దోషం అంటారు. అలాంటి వారు కూడా కింద చెప్పిన విధంగా చేస్తే సమస్యల నుంచి బయట పడవచ్చు. దోషం పోతుంది. అందుకు ఏం చేయాలంటే..
సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం కచ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే శాకాహారం మాత్రమే తినాలి. మాంసాహారం ఎట్టి పరిస్థితిలోనూ తినరాదు. ఇక కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుడిని ఆరాధిస్తే ఎంతో మేలు జరుగుతుంది. సూర్యగ్రహ ఆరాధన వల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతోపాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. ఉపవాసం ఉన్న రోజు తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి. గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి దానమివ్వాలి. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసంతో దానమిస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది.
ఇక పైవాటిని ఆచరించడానికి ఇబ్బందులు ఉంటే మొదట భక్తి ,శ్రద్ధతో నవగ్రహాలలో సూర్యుని ముందు నిలబడి.. స్వామి, నా సమస్యలు పరిష్కారం అయితే నేను విధివిధానం ప్రకారం పూజ చేసుకుంటాను అని మొక్కుకోవాలి. సూర్యునికి సంబంధించి జపాకుసుమ సంకాశం.. అనే శ్లోకాన్ని లేదా ఓం నమో భాస్కరాయనమః లేదా ఓం నమో సూర్యనారాయణాయనమః అనే నామాన్ని భక్తి శ్రద్దలతో కనీసం 108కి తగ్గకుండా పారాయణం చేయాలి. ఎర్రనిపూలు, గోధుమలను సూర్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కనీసం 7 వారాల పాటు చేస్తే తప్పక మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉండాలనుకువారు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే తెల్లవారు జామునే స్నానం పూర్తి చేసుకుని సూర్యనమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా పారిపోతాయి. అంతేకాదు.. పిల్లలకు అయితే జ్ఞాపకశక్తి చాలా వేగంగా పెరుగుతుంది. కనుక సూర్య భగవానున్ని ఆరాధించాలి. దీంతో సమస్యల నుంచి బయట పడడంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…