భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే అల్లంను ఉపయోగిస్తున్నారు. అల్లం మసాలా పదార్థం కిందకు వస్తుంది. దీన్ని మసాలా వంటకాల్లో ఎక్కువగా వేస్తుంటారు. ఇది ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అల్లంకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో అనేక ఔషధాలను తయారు చేస్తున్నారు కూడా. అయితే అల్లంను తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అల్లంతో నీళ్లను తయారు చేసి రోజూ పరగడుపునే తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. అల్లంతో ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం నీళ్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లను తీసుకోవాలి. అందులో చిన్న అల్లం ముక్కను వేసి సన్నని మంటపై నీళ్లను మరిగించాలి. నీళ్లను ఇలా 10 నిమిషాల పాటు మరిగించాక వడకట్టాలి. దీంతో అల్లం నీళ్లు తయారవుతాయి. ఇందులో రుచి కోసం ఒక టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న అల్లం నీళ్లను రోజూ పరగడుపునే తాగాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా రోజూ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అల్లంలో కోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీని కారణంగా శరీర మెటబాలిజం పెరుగుతుంది. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అలాగే కండరాల పనితీరు మెరుగు పడుతుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా ఉంటారు. వికారం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు రోజూ అల్లం నీళ్లను తాగుతుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది. అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఇక శరీరంలో వచ్చే వాపులను తగ్గించడంలోనూ అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
అల్లం నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్లు రాకుండా ఉంటాయి. ఇక ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో ఎలాంటి ఇన్ఫెక్షన్లు అయినా సరే తగ్గుతాయి. ఇలా అల్లం నీళ్లు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కనుక వాటిని రోజూ తాగాల్సిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…