రోజూ ప‌ర‌గ‌డుపునే అల్లం నీళ్ల‌ను ఇలా తీసుకుంటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లంను ఉప‌యోగిస్తున్నారు. అల్లం మ‌సాలా ప‌దార్థం కింద‌కు వ‌స్తుంది. దీన్ని మ‌సాలా వంట‌కాల్లో ఎక్కువ‌గా వేస్తుంటారు. ఇది ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అల్లంకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీంతో అనేక ఔష‌ధాల‌ను త‌యారు చేస్తున్నారు కూడా. అయితే అల్లంను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అల్లంతో నీళ్ల‌ను త‌యారు చేసి రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అల్లంతో ఎలాంటి లాభాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం నీళ్ల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్ర‌లో రెండు క‌ప్పుల నీళ్ల‌ను తీసుకోవాలి. అందులో చిన్న అల్లం ముక్క‌ను వేసి స‌న్న‌ని మంట‌పై నీళ్ల‌ను మ‌రిగించాలి. నీళ్ల‌ను ఇలా 10 నిమిషాల పాటు మ‌రిగించాక వ‌డ‌క‌ట్టాలి. దీంతో అల్లం నీళ్లు త‌యార‌వుతాయి. ఇందులో రుచి కోసం ఒక టీస్పూన్ తేనె క‌లుపుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న అల్లం నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి. త‌రువాత 30 నిమిషాల వ‌ర‌కు ఏమీ తీసుకోరాదు. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

అల్లంలో కోలిన్ అనే సమ్మేళ‌నం ఉంటుంది. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తుంది. దీని కార‌ణంగా శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. అలాగే కండ‌రాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. వికారం, అజీర్ణం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ అల్లం నీళ్ల‌ను తాగుతుంటే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. అలాగే జీర్ణ‌శ‌క్తి కూడా పెరుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ఇక శ‌రీరంలో వ‌చ్చే వాపుల‌ను త‌గ్గించ‌డంలోనూ అల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీని కార‌ణంగా కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

అల్లం నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇక ఈ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. దీంతో ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు అయినా స‌రే త‌గ్గుతాయి. ఇలా అల్లం నీళ్లు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. క‌నుక వాటిని రోజూ తాగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వివో నుంచి మరో పవర్ ఫుల్ ఫోన్.. భారత్‌లో Vivo X200T లాంచ్.. ఫీచర్లు, ధర చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…

Tuesday, 27 January 2026, 9:25 PM

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…

Tuesday, 27 January 2026, 7:39 PM

మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!

70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…

Tuesday, 27 January 2026, 5:49 PM

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM

అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…

Monday, 26 January 2026, 7:45 PM

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…

Monday, 26 January 2026, 5:34 PM