Vijay Varasudu Movie : ఈ మధ్య కాలంలో చాలా వరకు మూవీలు థియేటర్లలోకి వచ్చిన వెంటనే చాలా తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇందుకు స్టార్ హీరోల సినిమాలు ఏమీ మినహాయింపు కాదు. అందువల్ల ప్రేక్షకులు చాలా వరకు ఓటీటీల్లోనే మూవీలు చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోల అభిమానులు అయితే ముందుగా థియేటర్లలో సినిమాలను చూస్తున్నారు. తరువాత ఓటీటీల్లోనూ ఆ మూవీలను చూస్తూ పండుగ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు చాలానే ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అయితే ఇక మరో స్టార్ హీరో మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతోంది. అదే.. విజయ్ నటించిన వారసుడు మూవీ.
తమిళ నటుడు విజయ్ హీరోగా.. దిల్ రాజు ఈ మధ్యే వారసుడు మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ తమిళంలో వరిసుగా వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల ముందు నిలబడలేకపోయింది. ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఇందులో విజయ్కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా యాక్ట్ చేసింది.
ఫ్యామిలీ డ్రామా జోనర్లో ఈ మూవీ రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. అయితే విజయ్ యాక్టింగ్, రష్మిక గ్లామర్ ఈ మూవీని ఆ మాత్రం నిలిపాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఓవరాల్గా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లను కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి గాను అమెజాన్ ప్రైమ్ సంస్థ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్లోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఫిబ్రవరి 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే విడుదలైన నెల రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఓటీటీలో ఈ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…