Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఆయన రెండో పెళ్లి 2020 డిసెంబర్ లో జరిగింది. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం అత్యంత సన్నిహితుల మధ్య ఆయన వివాహం చేసుకున్నారు. 49 ఏళ్ల వయసులో దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 11 గంటలకు ఆయన వివాహం చేసుకున్నారు. అయితే దిల్ రాజు రెండో పెళ్లి విషయం బయటకు రాగానే.. అటు ఇండస్ట్రీలోనూ బయటి జనంలో కూడా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువతి ఎవరు ? ఎందుకు చేసుకున్నారు అనే చర్చలు ఎక్కువగా జరిగాయి. అయితే తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో.. అందుకు కారణాలు ఏమిటో.. దిల్ రాజు వివరించారు.
ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తన రెండో పెళ్లి వెనుక ఉన్న అసలు కారణాన్ని ఓపెన్ గా చెప్పేశారు. తన భార్య అనిత చనిపోయాక తాను రెండేళ్ల పాటు ఒంటరిగా ఉన్నానని.. ఆమె మరణించాక కుమార్తె, అల్లుడు తన ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అయితే భార్య లేని లోటు స్పష్టంగా కనిపించిందని తెలిపారు. తాను రోజంతా ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఇంటికి వస్తే భార్యను చూశాక మనసు ప్రశాంతంగా ఉంటుందని.. కానీ భార్య లేకపోవడంతో తనకు ఏదో లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఈ క్రమంలోనే తన కుమార్తె, స్నేహితులు, బంధువులు రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పారని.. దాంతో అమ్మాయి కోసం వెదికానని అన్నారు.
అయితే కొందరు అమ్మాయిలను పరిశీలించాక తనకు వైదా అయితే కరెక్ట్ అనిపించి ఆమెతో మాట్లాడానని.. అన్నీ చెప్పానని.. దీంతో ఆమె పెళ్లికి ఒప్పుకుందని అన్నారు. అందువల్లే తాము పెళ్లి చేసుకున్నామని తమకు కుమారుడు జన్మించాడని అన్నారు. ఇక తన మొదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలసి వచ్చేలా తన కొడుక్కి అన్వయ్ అని పేరు పెట్టామని వివరించారు. ప్రస్తుతం అంతా హ్యాపీగా ఉందన్నారు దిల్రాజు. అయితే దిల్ రాజు మాటలను బట్టి చూస్తే మొదటి భార్య అనిత మరణం వల్ల ఆయన తీవ్రంగా కుంగి పోయినట్లు అర్థమవుతుందని.. ఆ బాధ నుంచి బయట పడేందుకే ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని.. అర్థం అవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా దిల్ రాజు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ మాత్రం వైరల్గా మారింది.
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…