Dasari Narayana Rao : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు శత్రువులు పెద్దగా ఎవ్వరూ లేరు. అందరూ ఆయనతో స్నేహంగానే ఉండేవారు. అయితే దర్శకరత్న దాసరినారాయణరావు మొదట ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడిగా ఉండేవారట. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టే సమయానికి వీళ్లిద్దరూ బద్ధశత్రువులుగా మారిపోయారని అప్పట్లో టాక్. అసలు దీనికి కారణం ఏంటంటే..
దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ చాలా సినిమాలే తీశారు. వీళ్ళు చాలా సన్నిహితంగానే ఉండేవారు. వీరి కాంబోలో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దాసరి నారాయణరావు తీసే సినిమాలు అన్నగారిని రాజకీయంగా ప్రేరేపించాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే చిన్నతనం నుంచి దాసరికి ఏఎన్నార్ అంటే చాలా అభిమానం ఉండేదట. ఆ తరువాత అక్కినేనితో గ్యాప్ రావడంతో దాసరి, ఎన్టీఆర్ బంధం బలపడిందని చెబుతుంటారు. ఇక కొంత కాలానికే వీరి మధ్య వైరం పెరిగింది. ఆ సమయంలో అసలు దాసరికి షూటింగ్ కోసం స్టూడియోలు కూడా ఇవ్వవద్దని ఎన్టీఆర్ కొందరికి చెప్పేవరకు వెళ్లిందట.
ఎన్టీఆర్తో అనేక సినిమాలు తీసిన దాసరి నారాయణరావుకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఎవ్వరూ ఊహించలేదట. దాసరి ఇందిరా గాంధీకి పెద్ద ఫ్యాన్ అంట. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండేవాడట. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఇందిర దాసరికి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈనాడు పత్రికలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు వస్తే.. దాసరి ఉదయం పత్రికను ప్రారంభించి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా వార్తలు రాయించారట. ఎన్టీఆర్ రెండోసారి ఓడిపోవడానికి దాసరి నారాయణరావు కూడా ఓ కారణమని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అందుకే రాజకీయం ఎంతటి మిత్రులనైనా శత్రువులుగా మారుస్తుంది అంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…