సినిమా ఇండస్ట్రీ అంటేనే అంత. కొందరు హీరోలు తమ వద్దకు వచ్చే కథలను రిజెక్ట్ చేస్తారు. అయితే అవే కథలతో వేరే హీరోలు సినిమాలు తీసి హిట్ కొడతారు. ఇంకా చెప్పాలంటే.. అలా కొందరు హీరోలు రిజెక్ట్ చేసిన కథలను ఇంకొందరు హీరోలు తీసి రికార్డులను కొల్లగొడుతుంటారు. ఇలా చాలా మంది హీరోలకు జరుగుతూనే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే.. అప్పట్లో చిరంజీవి చేయాల్సిన సినిమా. కానీ కథ నచ్చలేదని ఆయన రిజెక్ట్ చేశారు. దీంతో రజనీకాంత్ అదే కథను ఓకే చేశారు. ఫలితంగా ఆ మూవీతో రజనీ హిట్ కొట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి రికార్డులను బ్రేక్ చేసింది. ఇంతకీ అసలు ఆ మూవీ ఏదంటే..
అప్పట్లో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మణిచిత్ర తాల్. ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 1993లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు రీమేక్ గా 2004 లో కన్నడలో ఆప్తమిత్ర అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విష్ణువర్థన్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
కాగా ఇదే సినిమాను తమిళ్ లో రజినీకాంత్ హీరోగా చంద్రముఖి అనే టైటిల్ ల్ తో తెరకెక్కించారు. అంతే కాకుండా ప్రభు ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జ్యోతిక, నయనతార హీరోయిన్ లు గా నటించారు. ఈ సినిమాకు మొదట నాగవల్లి అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ రజినీకాంత్ చంద్రముఖి అనే టైటిల్ ను సూచించడంతో అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 2005లో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేక్షకులు థియేటర్ లలో జ్యోతిక నటనకు తీవ్రంగా భయపడిపోయారు.
అయితే ఇదే సినిమాను తెలుగులో కూడా డబ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అయితే నిజానికి దర్శకుడు వీఎన్ ఆదిత్య ఆప్తమిత్ర సినిమా చూడాలని చిరంజీవికి ముందుగానే సీడీని పంపించాడు. ఇక ఆ సినిమాను చూసిన చిరు రిజెక్ట్ చేశారు. ఆయనకు చంద్రముఖి కథ నచ్చలేదు. దీంతో రజనీ ఆ మూవీని చేశారు. రికార్డులను బ్రేక్ చేశారు. అయితే చంద్రముఖి విడుదలయ్యాక చిరు వీఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి ఆయనను అభినందించాడు. అలా చిరు రిజెక్ట్ చేసిన కథతో రజినీ రికార్డులు క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక మంచి మూవీని మిస్ అయ్యారని చెప్పవచ్చు. లేదంటే ఆయనకు క్రేజ్ మరింతగా పెరిగేది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…