Chiranjeevi On Acharya : ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది అపోహ మాత్రమేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారం ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను ఎంతో పెద్ద వాణ్ణి చేసిందని తెలిపారు. సినీ రంగాన్ని వదిలి కొన్నాళ్లు వేరే రంగానికి వెళ్లాను. తిరిగొచ్చాకే సినీ పరిశ్రమ విలువ మరింత తెలిసిందన్నారు. అలాగే సినిమా డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద స్టార్లు.. వారి కాల్షీట్లు దొరికితే హడావుడిగా సినిమాలు చేయోద్దని డైరెక్టర్లకు సూచించారు. డైరెక్టర్లు సినిమా విషయంలో బాగా కసరత్తు చేయాలన్నారు.
కంటెంట్ ఉంటే జనం తప్పకుండా సినిమా చూసేందుకు థియేటర్కు వస్తారన్నారు. అందుకు లేటెస్ట్ గా వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలే ఉదాహరణ. కంటెంట్ లేకపోతే సినిమా రెండో రోజే పోతుంది. అందులో నేను కూడా ఓ బాధితుడినే. దర్శకులే మూవీకి కెప్టెన్ ఆఫ్ ది షిప్. సినిమాలో ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. లేదా ఊపిరి సలపని ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఉదాహరణకు అనుదీప్ ఇచ్చిన జాతిరత్నాలు. ఆ విధంగా దర్శకులు కథలపై ఫోకస్ పెట్టాలి. ఆర్టిస్టుల డేట్స్ వచ్చేస్తున్నాయని హాడావుడి పడిపోయి.. ఏదో ఒకటిలే ముందు బండి ఎక్కించేద్దామనే ఆలోచన వద్దు.
ఎందుకంటే దర్శకులపై ఎంతో మంది టెక్నీషియన్స్.. బయ్యర్స్.. ఇతరులు ఆధారపడి ఉంటారు. జయాపజయాలు మన చేతిలో లేకపోయినా, హిట్ చేయాలనే ఆలోచనతోనే దర్శకులు కంటెంట్ను సిద్ధం చేసుకోవాలని సూచించారు చిరంజీవి. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీని వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టం శెట్టి డైరెక్ట్ చేశారు. జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్పై ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీని నిర్మిస్తున్నారు. ఏడిద శ్రీరామ్ చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2న సినిమా రిలీజ్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…