Allu Studios : హైదరాబాద్ మరో ఫిలిం స్టూడియోకు వేదికైంది. ఇప్పటికే అగ్ర హీరోలకు చెందిన ఫిలిం స్టూడియోలు ఉండగా.. వాటి సరసన అల్లు ఫ్యామిలీకి చెందిన అల్లు స్టూడియోస్ వచ్చి చేరింది. అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్ను శనివారం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య లాంటి మహా నటుడి పేరిట ఈ స్టూడియోస్ను నిర్మించడం అభినందనీయమన్నారు. అందుకు గాను అల్లు అరవింద్ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. తన కల నెరవేరిందని అన్నారు. అలాగే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య లాంటి మహా నటుడి పేరిట స్టూడియోస్ నిర్మించడం గొప్ప విషయమన్నారు. ప్రజల ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అల్లు ఫ్యామిలీలో పుట్టినందుకు గర్విస్తున్నానని తెలిపారు. ఇక అల్లు స్టూడియోస్ విషయానికి వస్తే.. దీన్ని 10 ఎకరాల్లో నిర్మించారు. హైదరాబాద్లోని కోకాపేటలో ఈ స్టూడియో ఉంది.
సరిగ్గా ఏడాది కింద ఈ స్టూడియోస్కు భూమి పూజ చేశారు. కాగా అక్టోబర్ 1వ తేదీన అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించారు. దాదాపు పది ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులను ఇందులో చేసుకునేలా ప్లాన్ చేశారు. ఇక ఈ స్టూడియోని నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తోపాటు ఆయన సోదరులు అల్లు బాబీ (వెంకటేష్), అల్లు శిరీష్లు కలిసి నిర్మించారు.
షూటింగ్లకు సంబంధించిన బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతో షూటింగ్ లు చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితోపాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే గత కొంత కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని వస్తున్న వార్తలకు ఈ రోజు చెక్ పెట్టినట్లు అయింది. అందరూ కలసి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో అవన్నీ పుకార్లే అని స్పష్టమైంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…