Allu Studios : హైదరాబాద్ మరో ఫిలిం స్టూడియోకు వేదికైంది. ఇప్పటికే అగ్ర హీరోలకు చెందిన ఫిలిం స్టూడియోలు ఉండగా.. వాటి సరసన అల్లు ఫ్యామిలీకి చెందిన అల్లు స్టూడియోస్ వచ్చి చేరింది. అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్ను శనివారం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య లాంటి మహా నటుడి పేరిట ఈ స్టూడియోస్ను నిర్మించడం అభినందనీయమన్నారు. అందుకు గాను అల్లు అరవింద్ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. తన కల నెరవేరిందని అన్నారు. అలాగే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య లాంటి మహా నటుడి పేరిట స్టూడియోస్ నిర్మించడం గొప్ప విషయమన్నారు. ప్రజల ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అల్లు ఫ్యామిలీలో పుట్టినందుకు గర్విస్తున్నానని తెలిపారు. ఇక అల్లు స్టూడియోస్ విషయానికి వస్తే.. దీన్ని 10 ఎకరాల్లో నిర్మించారు. హైదరాబాద్లోని కోకాపేటలో ఈ స్టూడియో ఉంది.
సరిగ్గా ఏడాది కింద ఈ స్టూడియోస్కు భూమి పూజ చేశారు. కాగా అక్టోబర్ 1వ తేదీన అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించారు. దాదాపు పది ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులను ఇందులో చేసుకునేలా ప్లాన్ చేశారు. ఇక ఈ స్టూడియోని నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తోపాటు ఆయన సోదరులు అల్లు బాబీ (వెంకటేష్), అల్లు శిరీష్లు కలిసి నిర్మించారు.
షూటింగ్లకు సంబంధించిన బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతో షూటింగ్ లు చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితోపాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే గత కొంత కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని వస్తున్న వార్తలకు ఈ రోజు చెక్ పెట్టినట్లు అయింది. అందరూ కలసి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో అవన్నీ పుకార్లే అని స్పష్టమైంది.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…