Triphala Churnam : త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేద ఔషధం. ఈ ఔషధం మన పూర్వీకుల నుండి వారసత్వంగా లభిస్తున్న సర్వరోగ నివారిణి. త్రిఫల చూర్ణాన్ని ప్రకృతి సిద్ధమైన యాంటీ బయోటిక్ అని కూడా పిలుస్తారు. మన దేహంలోని విషపదార్థాలను శుభ్రం చేయడంలో ఈ త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన ఈ మిశ్రమాన్నే త్రిఫల చూర్ణం అని అంటారు. త్రిఫల చూర్ణంలో ఉన్న ఉసిరికి చలువచేసే గుణం కలిగి ఉంటుంది. ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అదేవిధంగా కరక్కాయ కాలేయానికి సంబంధించిన భయంకర వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. అంతేకాకుండా నాడీ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. తానికాయ అజీర్తి సమస్యతో బాధపడేవారికి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఈ మూడు కలిసిన త్రిఫల చూర్ణంగా మానవ శరీర ఆరోగ్యం కాపాడడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలను నియంత్రిస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సహాయపడతాయి. ఈ మూడింటినీ మెరుగుపరిచే గుణం త్రిఫల చూర్ణానికి ఉంది. అందుకనే ఈ త్రిఫల చూర్ణాన్ని నేటికీ కూడా అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తాయో మనిషి ఆరోగ్యంగా సరైన బరువులో ఉంటాడు. ఈ మూడు దోషాలు మన శరీరంలో సక్రమంగా పనిచేయవో మనిషి అధిక బరువు పెరగడం అనే ప్రక్రియ మొదలవుతుంది. అధిక బరువుతో బాధపడుతున్నవారు త్రిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలోకి వస్తుంది.
100 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకుంటే 52 గ్రాములు కార్బొహైడ్రేట్స్ 38 గ్రాములు ఫైబర్ ఉంటాయి. ఈ త్రిఫల చూర్ణం ఔషధం బరువు తగ్గించడంలో ఎలా పని చేస్తుంది అనే పరిశోధన చేశారు. బరువు తగ్గడానికి త్రిఫల చూర్ణం ఎలా ఉపయోగపడుతుందని పరిశోధన చేస్తే 64 మంది, మరొక 64 మంది రెండు గ్రూపలకు చెందిన వారి బరువుపైన పరిశోధన ప్రారంభించి 2012లో షాహిద్ యూనివర్సిటీ వీరిద్దరికీ సమానంగా వ్యాయామం, డైట్ సమానంగా చేయించారు.
మొదటి 64 మందికి ఐదు గ్రాముల త్రిఫల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం ఇచ్చేవారు. మరొక అరవై నాలుగు మందికి త్రిఫల చూర్ణం కాకుండా హెర్బల్ పౌడర్ ఇచ్చేవారు. మూడు నెలల పాటు ఇదే విధంగా ఇస్తే త్రిఫల తీసుకున్న 64 మంది, త్రిఫల చూర్ణం తీసుకోని 64 మంది కంటే ఐదు కేజీలు బరువు తగ్గారు అని పరిశోధనలో వెల్లడయింది. ఈ త్రిఫల బరువు తగ్గడానికి సైంటిఫిక్ గా పరిశోధన చేస్తే కణం లోపల ఆహార పదార్థాలను బాండ్ చేసే మైటోకాండ్రియాలు మెటబాలిజంని పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇక రెండో పరిశోధన 2012లో హైదరాబాదులో బిట్స్ పిలాని క్యాంపస్ లోఎలుకల పైన పరిశోధన చేశారు.
ఈ త్రిఫల చూర్ణం నిత్యం తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరగడం లేదు అని ఈ పరిశోధన ద్వారా తేలింది. దీనికి గల కారణం మనం తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. తీసుకున్న ఆహారంలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్, సింపుల్ కార్బొహైడ్రేట్స్ గా మారితేనే గ్లూకోజ్ గా తయారవుతుంది. కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ సింపుల్ కార్బొహైడ్రేట్స్ గా మారడానికి అవసరమయ్యే ఆల్ఫా అమైలేజ్ అనే కణాలు గ్లూకోజ్ ని తయారుచేయడంలో ఉపయోగపడుతుంది. అప్పుడు కార్బొహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. కాబట్టి ఈ ఆల్ఫా అమైలేజ్ ని త్రిఫల చూర్ణం తగ్గిస్తుంది. డయాబెటిస్ పేషెంట్స్ ఉదయం, సాయంత్రం ఐదు గ్రాముల చొప్పున త్రిఫల చూర్ణాన్ని వేడి నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి సహకరిస్తుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…