Koratala Siva : ఆచార్య సినిమా కొరటాల శివ కెరీర్ పై చాలా ప్రభావం చూపించింది. మంచి క్రేజ్ ఉన్న కమర్శియల్ డైరెక్టర్ గా ఇన్ని సంవత్సరాలలో ఆయన సంపాదించుకున్న పేరును ఒక్క దెబ్బతో పాతాళానికి పడిపోయేలా చేసింది. అయితే చిరంజీవి అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆయనపై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఆయనను సోషల్ మీడియాలో ఏకి పారేస్తూనే ఉన్నారు. తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ విడుదలైన తరువాత కూడా చిరు అభిమానులు కొరటాల శివను వదలడం లేదు.
ఇక గాడ్ ఫాదర్ రిలీజ్ అయిన మొదటి రోజునుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. దీంతో మెగా అభిమానులు పట్టరాని సంతోషంలో ఉన్నారు. సోషల్ మీడియాలో బాస్ ఈజ్ బ్యాక్ అని ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో అభిమానులు ఆనందంలో తేలియాడుతున్నారు.
ఈ క్రమంలో కొందరు మళ్లీ కొరటాల శివను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. మోహన్ రాజా చిన్న దర్శకుడు అయినప్పటికీ అభిమానులు ఏం కోరుకుంటున్నారో చిరంజీవిని అలాగే చూపించాడని కామెంట్ చేస్తున్నారు. ఆచార్య పేరుతో నువ్వు తీసింది సినిమా కాదు చెత్త అని కొరటాలను విమర్శిస్తున్నారు. మోహన్ రాజాను చూసి అయినా నువ్వు నేర్చుకోవాలని కొరటాల శివను ఉద్దేశించి కొందరు అభిమానులు ట్వీట్ చేశారు.
అయితే ఇప్పుడు కొరటాల కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాలని కొందరు అభిప్రాయ పడుతున్నారు. చిరంజీవి ఏ విధంగా అయితే గాడ్ ఫాదర్ తో తిరిగి వచ్చాడో కొరటాల కూడా అదే విధంగా ఎన్టీఆర్ తో తను తీయబోయే తదుపరి సినిమాతో బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమా తీసి తనను తాను నిరూపించుకోవాలని కొందరు ఆశిస్తున్నారు. దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషిస్తున్నారు. మరి కొరటాల ఏం చేస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…