Chiranjeevi : పూరీ జగన్నాథ్కు డైనమిక్ డైరెక్టర్గా ఎంతో పేరుంది. మాస్ ఆడియెన్స్కు మంచి కిక్ ఇచ్చే డైలాగ్లను సినిమాల్లో పెడుతుంటారు. ఆయన తీసిన సినిమాల్లో కొన్ని ఫ్లాపులు ఉన్నప్పటికీ.. ఓవరాల్గా పూరీకి ప్రేక్షకుల్లో మంచి పేరే ఉంది. అయితే ఆయన చిరంజీవితో సినిమా చేయలేదు. వారిద్దరి మధ్య ఏమైందో కూడా చాలా మందికి తెలియదు. కానీ తాజాగా చిరు 154 మూవీకి ఆయన అతిథిగా హాజరవడం చూస్తుంటే.. పాత గొడవలు, మనస్ఫర్థలు అన్నీ మరిచిపోయారని.. పూరీ మెగా కాంపౌండ్కు దగ్గరయ్యారని అనిపిస్తోంది.
చిరంజీవి 154వ చిత్రాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పూరీ జగన్నాథ్, రాఘవేంద్ర రావు, వినాయక్ వంటి వారు హాజరై చిత్రాన్ని లాంచ్ చేశారు. అయితే పూరీ సడెన్గా చిరంజీవి ప్రోగ్రామ్లో ప్రత్యక్షమైనందుకు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో చిరంజీవితో ఆటో జానీ సినిమాను పూరీ ప్లాన్ చేశాడు. మొదటి పార్ట్ నెరేషన్ బాగానే వచ్చిందన్నారు. కానీ ఏమైందో తెలియదు, ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసింది. తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు.
అయితే చిత్రంలో సెకండాఫ్ బాగా లేదని చిరంజీవి బయటి వ్యక్తులతో అన్నారట. అదేదో తనకే చెబితే ఇంకో వెర్షన్ రాసి ఇచ్చే వాణ్ని కదా.. అని పూరీ విచారించాడట. దీంతో ఆటో జానీ కాస్తా మధ్యలోనే ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ గతం గతః. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పూరీ సడెన్గా చిరు మూవీకి గెస్ట్లా వచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరూ కలసి భవిష్యత్తులో ఏదైనా సినిమా చేస్తారేమోనని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి వీరి క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తుందో, రాదో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…