Nagababu : మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి ఫోటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానికి దారి తీసింది. దీంతో మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. అయితే సెన్సేషన్ ఏదైనా.. సిచువేషన్ ఎలాంటిదైనా.. ఓన్ చేసుకుంటారు నాగబాబు.
చివరకు దాన్ని వివాదాస్పదంగా మారుస్తాడు. అన్నింటిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తాడు. అది కాస్తా ఇష్యూగా మారాక.. వివరణ ఇచ్చుకుంటాడు. మెగా బ్రదర్ నాగబాబుకు ఇది కామన్గా మారింది. తాజాగా గరికపాటి, మెగాస్టార్ ఇష్యూలో కూడా సేమ్ సీన్. చిన్న విషయాన్ని.. తన ట్వీట్తో పెద్దదిగా చేశాడు. చివరకు వివాదాస్పదంగా మార్చాడు. చిరు, గరికపాటి గొడవలో.. నాగబాబు రోల్ ఏంటి..? ఆయన వల్ల మెగా ఫ్యామిలీకి ఒరిగిందేంటి..? అటు అన్నయ్య సినిమాల్లో.. ఇటు తమ్ముడు రాజకీయాల్లో.. ఇద్దరూ సక్సెస్ ఫుల్ జర్నీలో ఉన్నారు.
ఈ ఇద్దరి మధ్యలో ఉన్న మిడిల్ బ్రదర్ నాగబాబు మాత్రం సినిమాల్లో సక్సెస్ కాలేకపోయినా స్మాల్ స్క్రీన్పై మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్లో ఆయన నవ్వులకు ఫిదా కాని వారెవ్వరుండరు. అలాంటి నాగబాబు మాత్రం ఎప్పుడూ ఏదో వివాదంపై స్పందిస్తూ ఉంటాడు. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి మధ్య జరిగిన చిన్న విషయంలో తాను ఎంటరై ఇష్యూగా మార్చేశాడు. రచ్చ రచ్చ చేశాడు. ఎప్పట్లాగే మళ్లీ తానే వివరణ ఇచ్చుకున్నాడు. అయితే మెగా బ్రదర్ ఒక ట్వీట్ పెట్టకముందే, మెగా అభిమానులు అవధానిని పెద్దగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే నాగబాబు హైలైట్ చేయడంతో మీడియాకు వార్తగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…