Chiranjeevi : సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. ఆయన మొదటి సినిమా మిర్చి దగ్గర నుంచి భరత్ అనే నేను వరకు ప్రతి సినిమాలో సామాజిక అంశాన్ని టచ్ చేశారు. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కట్ చేస్తే.. ఆచార్య ఇటు డైరెక్టర్ కెరీర్ లో హీరో చిరు కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో చిరు ఎక్కడికి వెళ్లినా ఆచార్య ప్రస్తావన తప్పని సరైంది.
తాజాగా చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆచార్య సినిమా ఫ్లాప్ గురించి ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన స్పందించిన తీరుపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నాడంటే.. కెరీర్ ప్రారంభంలో సక్సెస్ వచ్చినప్పుడు ఆనంద పడేవాడిని.. ఫ్లాప్ వచ్చినప్పుడు బాధపడేవాడిని. అవి అప్పటి రోజులు. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. ఆచార్య విషయానికి వస్తే ఆ సినిమా ఫ్లాప్ నన్ను బాధించలేదు.
ఎందుకంటే డైరెక్టర్ చెప్పింది చేశాం. బాధపడ్డ విషయమేమంటే.. నేను, చరణ్ కలిసి తొలిసారి నటించాం. ఆ సినిమా పరాజయం బాధించింది. తర్వాత మేం కలిసి నటించినా ఆ జోష్ ఉండకపోవచ్చు అని అన్నారు చిరంజీవి. అయితే ఆచార్య ఫ్లాప్పై చిరంజీవి స్పందించిన తీరుని నెటిజన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను కాదని.. కొరటాల శివ సినిమా డైరెక్ట్ చేస్తారా. ఫ్లాప్ వస్తే దానికి అతన్నే పూర్తి బాధ్యుడ్ని చేయటం ఎంత వరకు కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా గాడ్ ఫాదర్ సక్సెస్ అయితే కానీ చిరు ఆచార్య డిజాస్టర్ నుంచి బయటకు వచ్చేలా లేడు. ఇక గాడ్ ఫాదర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…