Chiranjeevi : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే మూవీని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆచార్య ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీని ఈ ఏడాది మే 13న విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా కుదరలేదు.
అయితే కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ ఈ మూవీని మళ్లీ దసరాకు విడుదల చేస్తారని భావించారు. తరువాత సంక్రాంతి వరకు రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. కానీ అది కూడా వాయిదా పడింది. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగాస్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
కాగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపుగా 30 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. రామ్ చరణ్ పాత్రే సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ మూవీలో ఒక ప్రత్యేక పాటలో రెజీనా నటించిందని తెలిసింది. అలాగే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీతోపాటు చిరంజీవి మరో రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేస్తుండగా.. తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ లోనూ నటిస్తున్నారు. ఏది ఏమైనా తాజా ప్రకటన మాత్రం అభిమానులకు ఆనందాన్నిస్తుందని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…