Charmy Kaur : ఇటీవల భారీ అంచనాల నడుమ స్టార్ హీరోల సినిమాలు విడుదలవ్వడం, చివరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోతోన్నారు. మెగాస్టార్ ఆచార్య సినిమా విషయంలోనూ డిస్ట్రిబ్యూటర్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇక అందరూ కట్టకట్టుకుని కొరటాల శివ ఆఫీస్ ఎదుటకు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అలా రచ్చ చేయడంతో సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లకు కొరటాల శివ కొంత మొత్తాన్ని తిరిగిచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు పూరీ జగన్నాథ్ లైగర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా అదే పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు చాలా ఏరియాల్లో భారీగా నష్టపోయారట. వీరంతా కూడా ఛార్మీ, పూరీలను కలిసి తమ నష్టాలను ఎంతో కొంత పూడ్చమని అడిగేందుకు ప్రయత్నిస్తున్నారట. కానీ ఛార్మీ మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదట. మేం కూడా చాలా నష్టపోయాం. అలాంటప్పుడు మీకెక్కడి నుంచి ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతుందట. అయితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకి కనీసం ఛార్మీతో మాట్లాడేందుకు కూడా లైన్ దొరకడం లేదట.
దీంతో వారంతా కూడా ఈ ఇష్యూని ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే తమకు రావాల్సిన మొత్తాన్ని, వడ్డీలను చెల్లించిన తరువాతే నెక్ట్స్ సినిమాను తీసుకోండనే ఒత్తిడిని తీసుకురావాలని అనుకుంటున్నారట. మరి వీరి ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. అయితే కొన్ని రోజుల క్రితం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తిరిగి ఇచ్చిన మొత్తం మీద రకరకాల వార్తలు వచ్చాయి. లైగర్ సినిమాకి నష్టాలు రావడంతో.. పూరీ, ఛార్మీలకు విజయ్ రూ.6 కోట్లు తిరిగి ఇచ్చాడని సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…