Chandigarh University : చండీగఢ్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఓ సంఘటన సంచలనంగా మారింది. యూనివర్సిటీలో చదువుతున్న పలువురు విద్యార్థినులకు చెందిన స్నానం చేస్తున్న వీడియోలు 60 వరకు లీకయ్యాయని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినులకు చెందిన స్నానం చేస్తున్న వీడియోలు 60 వరకు లీకయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు తెలిపారు. ఓ విద్యార్థిని తన వీడియోను షిమ్లాలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్కు షేర్ చేసిందని.. అయితే ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఈ సంఘటనపై స్పందించిన చండీగఢ్ విద్యాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ సంఘటన కారణంగా విద్యార్థినులు ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు.
అయితే పంజాబ్ సీఎం భగవంత్ మన్ మాట్లాడుతూ.. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మన కూతుళ్లు మనకు గర్వకారణమని, ఈ సంఘటనలో దోషులను విడిచిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ సంఘటనపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. అలాగే ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ సంఘటన చాలా సిగ్గుచేటన్నారు. నిజానిజాలు నిగ్గు తేలే వరకు వేచి చూడాలని కోరారు. అయితే మరోవైపు చండీగఢ్ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…