సోషియో ఫాంటసీ, టైం ట్రావెల్ కొత్త కథాంశంతో ఆగస్టు 5న బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను అందుకున్నాడు కళ్యాణ్ రామ్. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో అలరిస్తోంది. కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేయగా ఆయన సరసన హీరోయిన్లుగా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందజేశారు. దర్శకుడు వశిష్ట కూడా పవర్ ఫుల్ కథాంశంతో ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడని చెప్పవచ్చు. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకుపోతోంది.
తాజాగా ఈ చిత్రం పార్ట్ 2 రూపంలోనూ రాబోతోంది అంటూ ఆసక్తికరమైన విశేషాలు వెల్లడయ్యాయి. బింబిసార కథాంశాన్ని నాలుగు భాగాలుగా విభజించినట్లు కళ్యాణ్ రామ్ ఒకసారి మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ లో బింబిసారుడు మనిషిగా మారే దశ మాత్రమే చూపించారు. ఇక తర్వాత పార్ట్-2 ఉంది అంటూ సంజీవని పుష్పం చూస్తూ ప్రేక్షకులకు ఒక హింట్ ఇచ్చారు.
మొదటి భాగంలో కథ పరంగా బింబిసారుడు తమ్ముడు దేవదత్తను చంపిన సన్నివేశం నుంచి.. చివరకు ప్రాణాపాయ స్థితికి చేరుకునే సమయం వరకు ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు కథను తెరకెక్కించాడు. అంటే మొదటి భాగంలో కేవలం బింబిసారుడు మనిషిగా మారే దశను మాత్రమే మనకు దర్శకుడు పరిచయం చేశాడు. పార్టు 2లో సంజీవని ద్వారా ప్రాణాలు పోసుకొని బింబిసారుడు తమ్ముడు దేవదత్తతో కలిసి రాజ్యపాలనను సరిదిద్దే ప్రయత్నం చేస్తాడని ప్రేక్షకులలో కొత్త ఊహలు తలెత్తుతున్నాయి.
కానీ ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా రెండో పార్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూ ద్వారా డైరెక్టర్ వశిష్ట, హీరో కళ్యాణ్ రామ్ లు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. త్వరలో బింబిసార చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాల క్లబ్ లో చేరిపోతుందని అంచనా వేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…