2003లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఆసిన్. ఈ చిత్రంలో ఆసిన్ రవితేజకు జోడీగా నటించి ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో రవితేజకు, హీరోయిన్ ఆసిన్ కూడా అమ్మనాన్న ఓ తమిళమ్మాయి చిత్రం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.
ఈ చిత్రంలో ఆసిన్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో నిజంగా తమిళ అమ్మాయి అన్నట్లు నటనతో అందర్నీ ఆకట్టుకుంది. వాస్తవానికి ఆసిన్ ఒక మలయాళం అమ్మాయి. మొదటి చిత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడం ద్వారా ఆసిన్ ఆ తర్వాత నాగార్జున శివమణి చిత్రానికి ఆఫర్ చేజిక్కించుకుంది. ఆసిన్ నటన, ప్రతిభ నచ్చడంతో శివమణి చిత్రంలో కూడా ఆఫర్ ఇచ్చారు దర్శకుడు పూరీ జగన్నాథ్.
శివమణి చిత్రం కూడా సక్సెస్ అవ్వడంతో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్ తో ఘర్షణ, పవన్ కళ్యాణ్ తో అన్నవరం వంటి చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. సూర్య నటించిన గజినీ చిత్రం హిందీలో కూడా రీమేక్ చేశారు. తర్వాత 2008లో అమీర్ ఖాన్ నటించిన గజనీ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరకు దూరమైన ఆసిన్ బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లు సంపాదించుకుంటూ.. కెరీర్ మంచి పీక్స్ స్థాయిలో ఉన్న సమయంలో 2016లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది.
రాహుల్ శర్మ, ఆసిన్ జంటకు ఒక పాప కూడా ఉంది. మొదటి నుంచి ఆసిన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆమెకు గానీ, ఆమె కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ గానీ బయటకు కనిపించవు. కానీ తాజాగా ఇప్పుడు ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఆసిన్ మునుపటి కన్నా ఇంకా ఎక్కువ గ్లామరస్ లుక్ తో కనిపిస్తూ అందరి చూపులను ఆకర్షించింది. నిజంగా మనం చూస్తుంది ఆ ఆసిన్ యేనా అనే విధంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…