Bigg Boss OTT Telugu : బిగ్బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా పూర్తి కావడంతో త్వరలోనే బిగ్బాస్ ఓటీటీని ప్రారంభిస్తామని హోస్ట్ నాగార్జున అప్పట్లోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. కొందరు పాత కంటెస్టెంట్లతోపాటు కొందరు కొత్త కంటెస్టెంట్లను కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీలో 4 మంది పాత కంటెస్టెంట్లను మళ్లీ తీసుకోనున్నారని సమాచారం. అరియానా, అఖిల్, తనీష్, ఆదర్శ్, అలీ రెజా, హరితేజ వంటి పాత కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.
పాత కంటెస్టెంట్లతోపాటు కొత్తగా యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ఢీ10 విన్నర్ రాజు, టిక్టాక్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాంకర్ ప్రత్యూష తదితరులను కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వివరాలపై స్పష్టత రావల్సి ఉంది. త్వరలోనే ఈ వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.
కాగా బిగ్బాస్ ఓటీటీని 82 రోజుల పాటు ప్రసారం చేస్తారు. రోజుకు 24 గంటలూ లైవ్ లో షోను ప్రసారం చేస్తారు. దీంతో ప్రేక్షకులు మరింత ఆదరిస్తారని నిర్వాహకులు విశ్వసిస్తున్నారు. ఇక ఈ వివరాలన్నింటిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…