Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్కు రేటింగ్స్ వచ్చాయి. దీంతో ఫినాలే సమయంలోనే హోస్ట్ నాగార్జున కీలక ప్రకటన చేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీని కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ క్రమంలోనే ఈ షోకు నిర్వాహకులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్లను ఫైనల్ చేశారని సమాచారం. గత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న కొందరు వివాదాస్పద కంటెస్టెంట్లను కూడా ఈసారి ఓటీటీ షోలో రప్పిస్తున్నారని తెలిసింది. దీంతో బిగ్ బాస్ ఓటీటీ రచ్చ రచ్చగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాగా బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించనున్న నేపథ్యంలో ఇటీవల నాగార్జున ఓ సందర్భంలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ 5వ సీజన్ ముగియడం తనను షాక్కు గురిచేసిందన్నారు. ఫినాలేను 5 నుంచి 6 కోట్ల మంది వీక్షించారని తెలిపారు. అయితే తనను ఓటీటీ షోకు కూడా హోస్ట్గా చేయాలని స్టార్ మా సంప్రదించిందని అందుకు తాను ఒప్పుకున్నానని తెలిపారు.
ఇక చానల్ ఎయిరింగ్ షో ఈవీపీ, హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ.. టీవీలో వచ్చే బిగ్ బాస్ షో యథా ప్రకారం కొనసాగుతుందని, దాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. కానీ డిజిటల్ వెర్షన్ షో అయిన బిగ్ బాస్ ఓటీటీ భిన్నంగా ఉంటుందని తెలిపారు. దీన్ని మరింత వినూత్నంగా డిజైన్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.
కాగా తమిళంలోనూ బిగ్ బాస్ ఓటీటీ షోను ఇటీవలే ప్రారంభించారు. దీనికి కమల హాసన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు బిగ్ బాస్ అల్టిమేట్ అని పేరు పెట్టారు. గత సీజన్లలో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లను ఈ ఓటీటీ షోలోకి రప్పించారు. అయితే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ షో లో యాంకర్ శ్రీముఖితోపాటు పలువురు పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ షో ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. దీన్ని రోజుకు 24 గంటలూ 82 రోజుల పాటు లైవ్లో ప్రసారం చేయనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…