Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్కు రేటింగ్స్ వచ్చాయి. దీంతో ఫినాలే సమయంలోనే హోస్ట్ నాగార్జున కీలక ప్రకటన చేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీని కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ క్రమంలోనే ఈ షోకు నిర్వాహకులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్లను ఫైనల్ చేశారని సమాచారం. గత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న కొందరు వివాదాస్పద కంటెస్టెంట్లను కూడా ఈసారి ఓటీటీ షోలో రప్పిస్తున్నారని తెలిసింది. దీంతో బిగ్ బాస్ ఓటీటీ రచ్చ రచ్చగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాగా బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించనున్న నేపథ్యంలో ఇటీవల నాగార్జున ఓ సందర్భంలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ 5వ సీజన్ ముగియడం తనను షాక్కు గురిచేసిందన్నారు. ఫినాలేను 5 నుంచి 6 కోట్ల మంది వీక్షించారని తెలిపారు. అయితే తనను ఓటీటీ షోకు కూడా హోస్ట్గా చేయాలని స్టార్ మా సంప్రదించిందని అందుకు తాను ఒప్పుకున్నానని తెలిపారు.
ఇక చానల్ ఎయిరింగ్ షో ఈవీపీ, హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ.. టీవీలో వచ్చే బిగ్ బాస్ షో యథా ప్రకారం కొనసాగుతుందని, దాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. కానీ డిజిటల్ వెర్షన్ షో అయిన బిగ్ బాస్ ఓటీటీ భిన్నంగా ఉంటుందని తెలిపారు. దీన్ని మరింత వినూత్నంగా డిజైన్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.
కాగా తమిళంలోనూ బిగ్ బాస్ ఓటీటీ షోను ఇటీవలే ప్రారంభించారు. దీనికి కమల హాసన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు బిగ్ బాస్ అల్టిమేట్ అని పేరు పెట్టారు. గత సీజన్లలో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లను ఈ ఓటీటీ షోలోకి రప్పించారు. అయితే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ షో లో యాంకర్ శ్రీముఖితోపాటు పలువురు పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ షో ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. దీన్ని రోజుకు 24 గంటలూ 82 రోజుల పాటు లైవ్లో ప్రసారం చేయనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…