Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్లో ఒకడిగా ఉన్న జస్వంత్ అనారోగ్యం వలన పదో వారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అతను అనారోగ్యంతో హౌజ్ నుండి బయటకు వెళుతున్నాడని తెలిసి హౌజ్మేట్సే కాకుండా అభిమానులు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ‘వర్టిగో’ వ్యాధి వల్ల హౌజ్లో ఉన్నప్పుడు జెస్సీ గట్టిగా మాట్లాడలేకపోయాడు, తినలేకపోయాడు.. సరిగా నడవలేకపోయాడు.. మెడ పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
హౌజ్లో ఉన్నప్పుడు చాలా బాధపడ్డ జెస్సీ బయటకు వచ్చాక మాత్రం నానా హంగామా చేశాడు. మిడ్ నైట్ పార్టీలంటూ రచ్చ చేశాడు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి పార్టీలు చేసుకున్నాడు. ఇక ఫ్యాన్స్ మీట్లు, ఊరేగింపులతో జెస్సీ దుమ్ములేపేశాడు. బయట ఇంత ఉత్సాహంగా కనిపించిన జస్వంత్ లోపల మాత్రం అంత ఇబ్బందిగా ఎందుకు ఫీలయ్యాడు.. అనేది ఎవరికీ అర్ధం కాలేదు. అయితే తాజాగా వాటి వెనకాల ఉన్న కారణం బయటకు వచ్చింది.
విజయవాడలో జస్వంత్ ఓ వ్యాధి కోసం చికిత్స తీసుకున్నాడట. ఇది బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఒత్తిడికి గురవ్వడం, ఆటలు ఆడటం వల్ల ఎక్కువైంది.. బయటకు వచ్చాక ఆ ఒత్తిడి తగ్గిపోయింది. చికిత్స కూడా తీసుకున్న క్రమంలో జస్వంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
జెస్సీ కూడా తన ఆరోగ్యం బాగుందని చెప్పేశాడు. మొత్తానికి జెస్సీకి విజయవాడలో భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యాన్ మీట్లు పెట్టేశారు. జెస్సీ క్రేజ్ ఏంటో సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…