Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల తాజాగా పవన్ కళ్యాణ్తో సినిమాలు చేయనంటూ పెద్ద బాంబ్ పేల్చాడు. ఇది విని ఒక్కసారిగా పవన్ అభిమానులు షాక్ అయ్యారు. అయితే దాని వెనుక ఓ కారణం ఉందంటూ చెప్పుకు రావడంతో చల్లబడ్డారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యారు. వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాటిని పూర్తి చేసుకుని నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను.
అయితే నా కోరిక ఏంటంటే.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన త్వరగా ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్నానని అన్నారు. వన్ కల్యాణ్ నన్ను నిర్మాత చేశారు. ఆయన అంటే ఇష్టం.. కానీ జనసేనలో చేరడంలాంటిది ఏమీ లేదన్న బండ్ల గణేష్.. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే గౌరవం.. ఆయనను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని.. అలాగే నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభిమానినే అని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ గురించి, పవన్ కళ్యాణ్ గురించి నన్ను అడగకండి. ఎందుకంటే వారంటే నాకు ప్రేమ. నా ఫ్యామిలీని ప్రేమించినట్లే వారిని ప్రేమిస్తాను.. అని కూడా స్పష్టం చేశారు బండ్ల.
దర్శకుడితో గొడవపై కూడా స్పందించిన బండ్ల.. డైరెక్టర్తో గొడవలు అయి సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. నేను నాగార్జున సాగర్లాంటోడిని. నీళ్లు వస్తుంటాయి.. పోతుంటాయి. అన్ని నీళ్లు నావే అని అనుకోకూడదు. వాళ్లందరూ ఆ టైపే. భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ సినిమాలు తీస్తాను. సినిమానే నాకిష్టం, సినిమానే నా ప్రాణం అని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…