Bandla Ganesh : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఏం చేసినా వివాదాస్పదం అవుతుంటుంది. మొన్నటికి మొన్న పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ నటించిన చోర్ బజార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. డైలాగ్లు కూడా రాని వాళ్లను మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్లను చేశావు.. నీ కొడుకు ఫంక్షన్కు నువ్వు లేవు.. ఏంటి అన్నా.. అని పూరీని బండ్ల ప్రశ్నించారు. దీంతో ఆయా స్టార్స్కు చెందిన ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అలాగే పూరీ కూడా బండ్లకు ఇన్డైరెక్ట్గా చురకలు అంటించారు. అయితే ఆ వివాదం ముగియక ముందే బండ్ల మళ్లీ ఇంకో వివాదంలో ఇరుక్కున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండోసారి తండ్రి అయన విషయం విదితమే. ఆయన రెండో భార్య తేజస్విని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే 51 ఏళ్ల వయస్సులో ఆయన తండ్రి కావడంతో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఆయన మొదటి భార్య కుమార్తెకు ఇప్పటికే పిల్లలు ఉన్నారు. ఆయన తాత కూడా అయ్యారు. దీంతో తాత వయస్సులో తండ్రయ్యాడు.. అంటూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. అయితే దిల్ రాజు తండ్రి అయిన సందర్భంగా బండ్ల గణేష్ విషెస్ చెప్పారు. కానీ అక్కడే బండ్ల పప్పులో కాలేశారు.
దిల్రాజు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అన్న సంగతి అందరికీ తెలుసు. ఎస్వీసీ_అఫిషియల్ అనే అకౌంట్ పేరిట ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే దీనికి కాకుండా బండ్ల గణేష్ ఎస్వీసీసీ అనే ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ట్యాగ్ చేసిన బండ్ల దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎస్వీసీసీ అనేది శ్రీవెంకటేశ్వర సినీచిత్ర. ఇది బీవీఎస్ఎన్ ప్రసాద్కు చెందినది. దీంతో బండ్ల గణేష్ పెద్ద తప్పే చేశారు. దిల్ రాజుకు శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన అనుకున్నారు కానీ చెప్పింది మాత్రం ప్రసాద్కు. ఇది తెలియక చేసిన పొరపాటు.
అయితే దీన్ని సరిదిద్దుకోవచ్చు. కానీ బండ్ల గణేష్ ఆ ట్వీట్ను ఇంకా మార్చలేదు. అంటే ఆయన ట్వీట్ను పెట్టి అలాగే వదిలేశారన్నమాట. కనీసం దాన్ని చూడను కూడా చూడలేదు. దీంతో నెటిజన్లకు మళ్లీ మంచి మీల్స్ దొరికినట్లు అయింది. బండ్ల గణేష్ చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ వారు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. కనీసం తెలుసుకోకుండా ఒకరు తండ్రి అయితే ఇంకొకరికి విషెస్ ఎలా చెప్పావన్నా.. సరే ట్వీట్ చేశావు.. కానీ అందరూ ఇంతలా చెబుతున్నా.. కనీసం దాన్ని మార్చాలని ఎందుకు అనుకోవడం లేదు.. అంటూ నెటిజన్లు బండ్లను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. మరి ఇప్పటికైనా బండ్ల ఆ మిస్టేక్ను సరిచేసుకుంటారా.. లేదా.. అన్నది చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…