Bandi Sanjay : హుజురాబాద్లో తమదే విజయం అని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ ఈ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని అన్నారు. అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ఈ మేరకు సంజయ్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ ఉప ఎన్నికలో తెరాస పార్టీ అత్యంత అప్రజాస్వామికంగా, ఎన్నికల నియమ నిబంధలను ఉల్లంఘించి.. రాజకీయాలు చేసిందని సంజయ్ ఆరోపించారు. డబ్బుతో అడ్డగోలుగా ఓట్లను కొనేందుకు యత్నించారని మండిపడ్డారు. అయితే హుజురాబాద్ ప్రజలు మాత్రం తెరాస కుట్రలను తిప్పికొట్టారని, వారు విజ్ఞతతో వ్యవహరించి తమకే ఓటు వేశారని అన్నారు. ఈటల భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు.
ఈ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇందులో సాధించే విజయం ప్రజలదేనని అన్నారు. తెరాస చేసిన అక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీ గట్టి పోరాటం చేసిందన్నారు. రాష్ట్రంలో త్వరలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…