Bandi Sanjay : హుజురాబాద్లో తమదే విజయం అని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ ఈ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని అన్నారు. అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ఈ మేరకు సంజయ్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ ఉప ఎన్నికలో తెరాస పార్టీ అత్యంత అప్రజాస్వామికంగా, ఎన్నికల నియమ నిబంధలను ఉల్లంఘించి.. రాజకీయాలు చేసిందని సంజయ్ ఆరోపించారు. డబ్బుతో అడ్డగోలుగా ఓట్లను కొనేందుకు యత్నించారని మండిపడ్డారు. అయితే హుజురాబాద్ ప్రజలు మాత్రం తెరాస కుట్రలను తిప్పికొట్టారని, వారు విజ్ఞతతో వ్యవహరించి తమకే ఓటు వేశారని అన్నారు. ఈటల భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు.
ఈ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇందులో సాధించే విజయం ప్రజలదేనని అన్నారు. తెరాస చేసిన అక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీ గట్టి పోరాటం చేసిందన్నారు. రాష్ట్రంలో త్వరలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…