Bandi Sanjay : హుజురాబాద్లో తమదే విజయం అని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ ఈ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని అన్నారు. అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ఈ మేరకు సంజయ్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ ఉప ఎన్నికలో తెరాస పార్టీ అత్యంత అప్రజాస్వామికంగా, ఎన్నికల నియమ నిబంధలను ఉల్లంఘించి.. రాజకీయాలు చేసిందని సంజయ్ ఆరోపించారు. డబ్బుతో అడ్డగోలుగా ఓట్లను కొనేందుకు యత్నించారని మండిపడ్డారు. అయితే హుజురాబాద్ ప్రజలు మాత్రం తెరాస కుట్రలను తిప్పికొట్టారని, వారు విజ్ఞతతో వ్యవహరించి తమకే ఓటు వేశారని అన్నారు. ఈటల భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు.
ఈ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇందులో సాధించే విజయం ప్రజలదేనని అన్నారు. తెరాస చేసిన అక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీ గట్టి పోరాటం చేసిందన్నారు. రాష్ట్రంలో త్వరలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…