Balakrishna : నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. సినిమాల్లో అయినా రియల్ లైఫ్లో అయినా బాలకృష్ణ పంథా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే ఒక షో చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ షోలో సింగిల్ పర్సన్స్ కాకుండా ఫ్యామిలీలను ఇంటర్వ్యూ చేయనున్నారట.
తొలి ఎపిసోడ్లో మంచు ఫ్యామిలీతో బాలకృష్ణ ఇంటర్వ్యూ ఉండబోతోందని అంటున్నారు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి అతిథులుగా ఈ షో ఆసక్తికరంగా బాలయ్య నడిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా అల్లు అరవింద్ చిరంజీవి, రామ్ చరణ్ లని ఈ షోకు అతిథులుగా వచ్చేలాగా చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆహా కోసం ఓ సారి చిరంజీవిని సమంత ఇంటర్వ్యూకి తీసుకొచ్చారు అల్లు అరవింద్.
బాలయ్యకు, చిరంజీవికి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవంలో కూడా చిరంజీవి పాల్గొని బాలకృష్ణకు తన విషెస్ అందించారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్ షో కోసం చిరంజీవి తన తనయుడితో కలిసి రాబోతున్నారట. ఆయన ఇందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇదే కనుక జరిగితే షో దద్దరిల్లి పోవడం ఖాయం.. అని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…