Balakrishna : తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఆహా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు టాక్ షోలు, వంటల కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రసారం చేస్తూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకుపోతోంది. ఆహాలో గతంలో సమంతను వ్యాఖ్యాతగా ఉంచి సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సమంతను రంగంలోకి దించినా ఈ కార్యక్రమం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందని చెప్పవచ్చు.
ఇక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షోకి ప్రేక్షకాదరణ కరువైందని చెప్పవచ్చు. తాజాగా ఆహా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే బాలయ్య వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు పలు రకాల సందేహాలను వ్యక్తపరిచారు.
అసలు ఒక మాట ఎక్కువ మాట్లాడితే అందరిపై చేయి చేసుకునే బాలయ్య ఓపిగ్గా ఈ టాక్ షోను నిర్వహించగలరా.. అల్లు అరవింద్ ఏ నమ్మకంతో బాలకృష్ణను వ్యాఖ్యాతగా తీసుకున్నారు.. అంటూ చాలా రకాలుగా సందేహాలను వ్యక్తం చేశారు.
అయితే ఈ కార్యక్రమం ప్రోమోకి నిర్వాహకులు ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కు ఎవరూ ఊహించని విధంగా అత్యధిక ప్రేక్షకాదరణ లభించింది.
అలాగే ఎంతోమంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరారని ఆహా నిర్వాహకులు వెల్లడించారు. ఇక రెండవ ఎపిసోడ్ లో భాగంగా నాని బాలయ్యతో కలిసి సందడి చేశారు. కాగా మూడవ ఎపిసోడ్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను రంగంలోకి దింపనున్నారు. ఏది ఏమైనా ఆహాలో టాక్ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సమంత విఫలమైందని.. బాలకృష్ణ విజయం సాధించారని.. చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…