Balakrishna : తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఆహా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు టాక్ షోలు, వంటల కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రసారం చేస్తూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకుపోతోంది. ఆహాలో గతంలో సమంతను వ్యాఖ్యాతగా ఉంచి సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సమంతను రంగంలోకి దించినా ఈ కార్యక్రమం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందని చెప్పవచ్చు.
ఇక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షోకి ప్రేక్షకాదరణ కరువైందని చెప్పవచ్చు. తాజాగా ఆహా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే బాలయ్య వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు పలు రకాల సందేహాలను వ్యక్తపరిచారు.
అసలు ఒక మాట ఎక్కువ మాట్లాడితే అందరిపై చేయి చేసుకునే బాలయ్య ఓపిగ్గా ఈ టాక్ షోను నిర్వహించగలరా.. అల్లు అరవింద్ ఏ నమ్మకంతో బాలకృష్ణను వ్యాఖ్యాతగా తీసుకున్నారు.. అంటూ చాలా రకాలుగా సందేహాలను వ్యక్తం చేశారు.
అయితే ఈ కార్యక్రమం ప్రోమోకి నిర్వాహకులు ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కు ఎవరూ ఊహించని విధంగా అత్యధిక ప్రేక్షకాదరణ లభించింది.
అలాగే ఎంతోమంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరారని ఆహా నిర్వాహకులు వెల్లడించారు. ఇక రెండవ ఎపిసోడ్ లో భాగంగా నాని బాలయ్యతో కలిసి సందడి చేశారు. కాగా మూడవ ఎపిసోడ్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను రంగంలోకి దింపనున్నారు. ఏది ఏమైనా ఆహాలో టాక్ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సమంత విఫలమైందని.. బాలకృష్ణ విజయం సాధించారని.. చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…