Balakrishna : తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఆహా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు టాక్ షోలు, వంటల కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రసారం చేస్తూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకుపోతోంది. ఆహాలో గతంలో సమంతను వ్యాఖ్యాతగా ఉంచి సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సమంతను రంగంలోకి దించినా ఈ కార్యక్రమం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందని చెప్పవచ్చు.
ఇక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షోకి ప్రేక్షకాదరణ కరువైందని చెప్పవచ్చు. తాజాగా ఆహా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే బాలయ్య వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు పలు రకాల సందేహాలను వ్యక్తపరిచారు.
అసలు ఒక మాట ఎక్కువ మాట్లాడితే అందరిపై చేయి చేసుకునే బాలయ్య ఓపిగ్గా ఈ టాక్ షోను నిర్వహించగలరా.. అల్లు అరవింద్ ఏ నమ్మకంతో బాలకృష్ణను వ్యాఖ్యాతగా తీసుకున్నారు.. అంటూ చాలా రకాలుగా సందేహాలను వ్యక్తం చేశారు.
అయితే ఈ కార్యక్రమం ప్రోమోకి నిర్వాహకులు ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కు ఎవరూ ఊహించని విధంగా అత్యధిక ప్రేక్షకాదరణ లభించింది.
అలాగే ఎంతోమంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరారని ఆహా నిర్వాహకులు వెల్లడించారు. ఇక రెండవ ఎపిసోడ్ లో భాగంగా నాని బాలయ్యతో కలిసి సందడి చేశారు. కాగా మూడవ ఎపిసోడ్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను రంగంలోకి దింపనున్నారు. ఏది ఏమైనా ఆహాలో టాక్ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సమంత విఫలమైందని.. బాలకృష్ణ విజయం సాధించారని.. చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…