Chaurasia : హైదరాబాద్ మహానగరంలో కేబీఆర్ పార్క్కి ఓ విశిష్టత ఉంది. ఎంతో ఆహ్లదంగా ఉండే ఈ పార్క్కి నిత్యం చాలా మంది వాకింగ్కి వస్తూ ఉంటారు. సెలబ్స్ కూడా ఈ పార్క్లో వాకింగ్ తో పాటు పలు వ్యాయామాలు చేస్తుంటారు. అయతే ఇక్కడ పలుమార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఓ నటిపై దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు.
వాకింగ్ కు వెళ్లిన సినీనటి చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో కేబీఆర్ పార్క్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో నటి చౌరాసియా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ రోడ్ నంబర్ 9 వద్ద చౌరాసియా ఆదివారం సాయంత్రం వాకింగ్కు వెళ్లింది. అక్కడ ఓ దుండగుడు తనపై దాడిచేశాడు.
ఆమె డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వల్పంగా గాయపడ్డ ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఇప్పుడు వాకింగ్ కి వెళ్లే వారిలో భయాందోళనలను కలిగిస్తోంది.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…