సీఎం జగన్ ప్రభుత్వ అరాచకాలను యువత నిలదీయాలని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలో తెలుగు యువత ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, చింతకాయల విజయ్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం యువతను, విద్యార్థులను పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్ను యువత నిలదీయాలని లేదంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
సీఎం జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాలేజీలు తిరుగుతూ యువతను రెచ్చగొట్టారని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని అన్నారు. 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగ భృతిని ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించలేదన్నారు. కనుక యువత మేల్కొనాలని, తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…