సీఎం జగన్ ప్రభుత్వ అరాచకాలను యువత నిలదీయాలని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలో తెలుగు యువత ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, చింతకాయల విజయ్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం యువతను, విద్యార్థులను పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్ను యువత నిలదీయాలని లేదంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
సీఎం జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాలేజీలు తిరుగుతూ యువతను రెచ్చగొట్టారని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని అన్నారు. 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగ భృతిని ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించలేదన్నారు. కనుక యువత మేల్కొనాలని, తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…