సీఎం జగన్ ప్రభుత్వ అరాచకాలను యువత నిలదీయాలని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలో తెలుగు యువత ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, చింతకాయల విజయ్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం యువతను, విద్యార్థులను పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్ను యువత నిలదీయాలని లేదంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
సీఎం జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాలేజీలు తిరుగుతూ యువతను రెచ్చగొట్టారని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని అన్నారు. 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగ భృతిని ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించలేదన్నారు. కనుక యువత మేల్కొనాలని, తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…