ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలను ప్రజలు వైకాపాకు కట్టబెట్టారు. దీంతో జగన్ సీఎం అయ్యారు. అంతేకాదు, ఆయన పాదయాత్రలో, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూడా పూర్తి చేస్తున్నారు. దీంతో ఏ ఎన్నికల్లో అయినా సరే వైకాపా విజయ దుందుభి మోగిస్తూనే వస్తోంది. ఇక ఇటీవల తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే. కాగా ఆ ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో వైసీపీ తన సీటును మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని ఎగ్జిట్స్ పోల్స్ తేల్చి చెప్పాయి.
తిరుపతి లోక్సభ సిట్టింగ్ స్థానాన్ని వైకాపా మళ్లీ సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ క్రమంలోనే ఆరా ఎగ్జిట్ పోల్స్లో వైకాపాకు 65.85 శాతం, టీడీపీకి 23.10 శాతం, బీజేపీకి 7.34 శాతం ఓట్లు వస్తాయని తెలిపారు. అయితే తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక ఆత్మ సాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా వైకాపాకే సీటు వస్తుందని వెల్లడైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైకాపాకు 59.25 శాతం, టీడీపీకి 31.25 శాతం, బీజేపీకి 7.5 శాతం వరకు ఓట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఉప ఎన్నిక ఫలితాలు మే 2వ తేదీన వెలువడుతాయి కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…