భార‌త‌దేశం

లాక్‌డౌన్‌ భయం.. భారీగా నగదు విత్‌డ్రా చేస్తున్న ప్రజలు..?

ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలు భారీగా నగదును తమ వద్ద పెట్టుకున్నారు. బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్‌ చేసేందుకు వెనుకాడారు. తరువాత రూ.2000 నోటును రద్దు చేస్తారని అడపా దడపా వార్తలు వచ్చాయి. దీంతో అప్పుడప్పుడు ప్రజలు ఆ నోట్లను మార్చుకుని ఇతర నోట్లను భారీగా తమ వద్ద పెట్టుకున్నారు. అయితే దేశంలో రోజు రోజుకీ కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ లాక్‌డౌన్‌ పెడతారోనని ప్రజలు భయాందోళనలు చెందుతూ పెద్ద ఎత్తున నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది.

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో గతేడాది ప్రజలు భారీగా నగదును విత్ డ్రా చేశారు. చేతిలో డబ్బు ఉండాలని చెప్పి చాలా మంది డబ్బును విత్‌డ్రా చేస్తున్నారు. ప్రస్తుతం అనేక హాస్పిటల్స్‌లో డెబిట్, క్రెడిట్‌, యూపీఐ ల ద్వారా కాకుండా నగదును మాత్రమే పేమెంట్‌ రూపంలో తీసుకుంటున్నారు. అందువల్ల కూడా ప్రజలు పెద్ద ఎత్తున డబ్బును విత్‌ డ్రా చేస్తున్నారు.

ఇక గత 15 రోజుల్లోనే దేశంలోని ప్రజలు భారీగా నగదును విత్‌డ్రా చేశారని వెల్లడైంది. అంతకు ముందు 15 రోజులతో పోలిస్తే ఏప్రిల్‌ 9వ తేదీ నాటికి ప్రజల వద్ద ఉన్న డబ్బులో రూ.30,191 కోట్ల వరకు పెరిగిందని తేలింది. ప్రస్తుతం ప్రజల వద్ద రూ.27.87 లక్షల కోట్ల రూపాయల నగదు ఉందని వెల్లడైంది. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ మధ్య గతంలో కన్నా రూ.52,928 కోట్ల నగదు పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది.

దేశంలో కోవిడ్‌ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు నగదును భారీగా విత్‌ డ్రా చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే ఇబ్బందులు వస్తాయని, కనుక ముందు జాగ్రత్తగా డబ్బులు విత్‌డ్రా చేసి పెట్టుకుంటే మంచిదని ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకనే నగదు విత్‌డ్రాలు పెరిగినట్లు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న…

Friday, 27 February 2026, 2:58 PM

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని…

Thursday, 26 February 2026, 9:41 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాస్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి గాను…

Thursday, 26 February 2026, 6:59 PM

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన…

Thursday, 26 February 2026, 5:01 PM

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం…

Thursday, 26 February 2026, 1:20 PM

క్యాన్సర్ రిస్క్ తగ్గించే 5 ఆహారాలు: డాక్టర్ సౌరభ్ సెథి కీలక సూచనలు!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క్యాన్స‌ర్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి క్యాన్స‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని, 5 ర‌కాల…

Thursday, 26 February 2026, 12:01 PM

విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?

ఈ నెల 26వ తేదీన రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక…

Wednesday, 25 February 2026, 6:01 PM

వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ బంపర్ గిఫ్ట్.. రూ. 22 లక్షల కారు!

భార‌త అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్టు యువ కెర‌టం వైభ‌వ్ సూర్య‌వంశీకి టాటా మోటార్స్ ఖ‌రీదైన బ‌హుమ‌తిని అంద‌జేసింది. రూ.22…

Wednesday, 25 February 2026, 4:32 PM