ప్రేమంటే అంతే.. సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనూ ఒకరికి ఒకరు తోడుండాలి. ఒకరి కోసం ఇంకొకరు ప్రాణాలు ఇచ్చేందుకైనా, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. అవును.. ఆ జంట కూడా సరిగ్గా ఇలా చేసింది. భర్త తనకు ప్రేమను పంచితే భార్య తన భర్తకు తన శరీర అవయవాన్ని పంచి ఇచ్చింది. ఈ సంఘటనకు హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్ లో ఉన్న గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్ వేదికగా నిలిచింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ముంతాజ్ అనే మహిళ అదే ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తిని 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. మతాలు వేరు కావడంతో వారు పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే సుబ్బారెడ్డికి గుండె పోటు వచ్చింది. దీంతో వైద్యులు స్టంట్లు వేశారు. అనంతరం గతేడాది అతనికి కామెర్లు వచ్చాయి. పరిస్థితి విషమించింది. దీంతో అతన్ని మళ్లీ అదే హాస్పిటల్లో చేర్పించారు. ఈ క్రమంలో అతనికి పరీక్ష చేసిన వైద్యులు అతని లివర్ పూర్తిగా దెబ్బ తిన్నదని చెప్పారు. లివర్ను మార్పిడి చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు.
దీంతో ముంతాజ్ తన భర్తకు లివర్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఆపరేషన్ చేశారు. అందుకు రూ.20 లక్షలు ఖర్చు కాగా, రూ.10 లక్షలను ఏపీ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేసింది. ఇక ఆపరేషన్ విజయవంతం కావడంతో భార్య, భర్త ఇద్దరూ కోలుకుంటున్నారు. అలా సుబ్బారెడ్డి ఆమెకు ప్రేమను పంచితే ఆమె తన లివర్ను పంచి ఇచ్చింది. తన భర్తను రక్షించుకుంది. ఇప్పుడు వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…