భార్యా భర్తల మధ్య అనుబంధం ఎంతో గొప్పదని చెబుతారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. అయితే తుని మండలం కొత్తసూరవరంలో దంపతులు మృత్యువులో కూడా ఆ బంధాన్ని వీడలేదు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కర్ర త్రిమూర్తులు, రామలక్ష్మి దంపతులు శుక్రవారం ఉదయం ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
వీరిద్దరూ గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంత కాలంగా త్రిమూర్తులు అనారోగ్యంతో బాధపడుతుండగా రామలక్ష్మి కూడా కాలు విరిగి మంచానికే పరిమితం అయింది. ఈ సమయంలోనే శుక్రవారం ఉదయం త్రిమూర్తులు తన భార్య కోసం టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు.
ఇలా బయటకు వెళ్లిన త్రిమూర్తులు బయటికి వెళ్లిన చోటే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని ఇంటికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో అతని భార్య రామలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురై షాక్తో ప్రాణాలను కోల్పోయింది. ఈ విధంగా ఒకేసారి ఈ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకి వివాహం జరిగి 35 సంవత్సరాలు అయినప్పటికీ వీరికి పిల్లలు లేరు. దీంతో వీరి అంతిమ సంస్కారాలను బంధువులు నిర్వహించారు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…