ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడం చేత పెద్ద ఎత్తున వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండగా మరికొందరు ఈ వరదనీటిలో కొట్టుకుపోతూ మరణిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా అధిక వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది అని చెప్పవచ్చు. అధిక వర్షం ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వాగు దాటుతుండగా ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులు వాగులో గల్లంతైన ఘటన చోటు చేసుకుంది.
గత రెండు మూడు రోజుల నుంచి అధిక వర్షాలు కురవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన పిల్లలిద్దరినీ తీసుకొని రంపచోడవరంలో ఆధార్ ఈ-కేవైసీ ని పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో బడి గుంట – ఆకుర మధ్య వాగులో గల్లంతైంది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వాగు దాటుతూ ఉన్న గణేష్ దొర, వెట్టి వంశీ దొర అనే ఇద్దరు గిరిజన చిన్నారులు జారిపడి వాగులో గల్లంతయ్యారు.
ఈ క్రమంలోనే వారిని రక్షించబోయిన తల్లి కూడా అదే వాగులో కొట్టుకుపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా కేవలం ఒక అబ్బాయి మృతదేహం మాత్రమే లభించింది. మిగిలిన చిన్నారి, తల్లి కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…